పవన్ కు కేంద్రంలో పలుకుబడి ఉంటే జగన్ పై ఎంక్వయిరీ వేయించాలి !

-

పవన్ కళ్యాణ్ విశాఖ వారాహియాత్ర మూడవ విడతలో భాగంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై విమర్శలు చేస్తున్న వైనం అందరినీ ఎంతగానో విస్మయానికి గురిచేస్తోంది. అయితే పవన్ జగన్ పై చేస్తున్న ఆరోపణలు మరియు విమర్శల గురించి సిపిఐ నేత రామకృష్ణ పవన్ కు భలే కౌంటర్ ఇచ్చాడు. ఈయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో జగన్ ఏమైనా చేస్తున్నాడు అంటే కేంద్రంలో మోదీ సహకారం లేకుండా చేస్తున్నానని అనుకోవడం లేదన్నారు.. ఇక కేంద్రంతో కలిసి జగన్ ను ఆటాడిస్తా అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై కూడా గట్టి కౌంర్ ఇచ్చాడు రామకృష్ణ. నిజంగా పవన్ అంటున్నట్లు కేంద్రంతో మంచి సంబంధాలు మరియు అంత పలుకుబడి ఉంటే జగన్ చేశాడంటున్న అక్రమాలపై విచారణ చేయించాలి అంటూ డిమాండ్ చేశాడు.

అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుండి విశాఖ ను ప్రయివేటీకరణ కాకుండా ఆపేలా చూడాలని మరియు పోలవరం ప్రాజెక్టును పూర్తి అయ్యేలా చూడాలంటూ పవన్ కు సిపిఐ నేత రామకృష్ణ చురకలు అంటించాడు.

Read more RELATED
Recommended to you

Latest news