కేటీఆర్‌కి వాదికి.. వ్యాధులకు తేడా తెలియదు : రేవంత్‌ రెడ్డి

-

మంత్రి కేటీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేటీఆర్‌కి వాదికి.. వ్యాధులకు తేడా తెలియదంటూ హెద్దేవా చేశారు రేవంత్‌ రెడ్డి. నేను ఉద్యమం చేస్తున్నప్పుడు ఆయన అమెరికా లో బాత్ రూమ్ లు కడుగుతున్నారని విమర్శించారు. టికెట్లు అధిష్టానం ప్రకటిస్తుందన్న రేవంత్‌ రెడ్డి.. తెలంగాణ కి కాంగ్రెస్.. టీడీపీ మోసం చేసింది అంటే.. ఆ రెండు పార్టీలల్లో కేసీఆర్ ఉన్నాడని ఆయన వ్యాఖ్యానించారు.

War of words on public display: KTR calls Revanth a 'thug' and Revanth says  KTR is 'born liar'

బీఆర్‌ఎస్‌తో తెలంగాణకి అన్యాయం చేసింది కేసీఆర్‌ అని ఆయన మండిపడ్డారు. తెలంగాణకు అన్యాయం జరిగినా అన్నిటికీ ప్రత్యక్ష ద్రోహి కేసీఆర్‌ అని, తెలంగాణకి ద్రోహం చేసిన వారిని ఉరి తీయాల్సి వస్తే కేసీఆర్ నే తీయాలన్నారు. ఉరి తీస్తాం.. పిండం పెడతా అనేది తెలంగాణ సంస్కృతి అని, పార్టీ పేరులో తెలంగాణ అనే పదమే తీసేశాడు.. ఇప్పుడు ఆయనకు తెలంగాణ ఎందుకు అని ఆయన ప్రశ్నించారు.

 

అంతేకాకుండా.. ‘తెలంగాణ పేరునే హత్య చేసిన కేసీఆర్ ని .. తెలంగాణ వాది అని ఎలా అంటావు. కేఏ పాల్ కూడా లక్షల కోట్లు తెచ్చి లక్షలు పంచుతా అన్నాడు. కేసీఆర్‌, కేఏ పాల్ ఏదైనా చెప్తారు. నంది అవార్డుల పేరు.. గద్దర్ అవార్డులుగా మారుస్తాం. కాంగ్రెస్ అధికారంలో కి వచ్చాకా.. గద్దర్ అవార్డుల పేరుతో బహుకరిస్తాం. గద్దర్ విగ్రహం ట్యాంక్ బండ్ మీద పెడతాం. ఎన్నికలు వచ్చినప్పుడు పొత్తుల మీద చర్చ. ఇప్పుడు అలాంటి చర్చ లు ఏం లేవు. జాతీయ స్థాయిలోనే పొత్తుల పై చర్చలు. కిషన్ రెడ్డి అధ్యక్షుడు అయ్యాకా.. ఆ పార్టీ పరిస్థితి ఏంటి అన్నది బండి సంజయ్ ని అడిగితె చెప్తారు. సగం మంది బీజేపీ ఎంపీ లకు నమస్తే… సదా వత్సలే అనేది ఏంటో తెలియదు. సగం మంది ఎంపీ లు బయటి నుండి వచ్చిన వాళ్లే కదా..? ఈటల కు… రాజగోపాల్ రెడ్డికి తెలుసా..?’ అని రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news