ఆసీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటున్న కోహ్లీ, రాహుల్ !

-

ఈ రోజు వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా మరియు ఆస్ట్రేలియా ల మధ్యన చెన్నై వేదికగా మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. టాస్ గెలిచినా ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ మొదటగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు, కానీ ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ అంతా దారుణంగా విఫలం అయ్యి 199 పరుగుల వద్ద ఉండగా ఆల్ అవుట్ అయింది. ఇండియా బౌలర్లలో జడేజా 3 , బుమ్రా 2, కుల్దీప్ 2 వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియాకు కేవలం 2 పరుగులకె కీలకమైన ముగ్గరు వికెట్లను కోల్పోయింది. రోహిత్, ఇషాన్ కిషన్ మరియు శ్రేయస్ అయ్యర్ లు ముగ్గురూ డక్ అవుట్ కావడం అభిమానులను ఎంతగానో నిరాశపరిచింది.

ఆ తర్వాత వైస్ కెప్టెన్ రాహుల్ మరియు కోహ్లీ లు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆస్ట్రేలియా లాంటి బలమైన బౌలింగ్ లైన్ అప్ ను అడ్డుకుంటున్నారు. వీరిద్దరూ ఇలాగె మరికొంతసమయం ఆడితే విజయం ఇండియాదే అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news