రైతులకు శుభవార్త..ఈ నెల 7న వైఎస్సార్‌ రైతు భరోసా నిధులు విడుదల

-

YSR Rythu Bharosa funds  : ఏపీ రైతులకు శుభవార్త అందించింది జగన్‌ సర్కార్‌. ఈ నెల 7న వైఎస్సార్‌ రైతు భరోసా నిధులు విడుదల కానున్నాయి. ఈ నెల 7న సీఎం వైఎస్‌ జగన్‌ శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ నగదును రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.

CM Jagan's visit to Vijayawada today
YSR Rythu Bharosa funds will be released on 7th of this month

ఇందులో భాగంగానే ఎల్లుండి ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు సీఎం జగన్‌. ఈ సందర్భంగా పుట్టపర్తి బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం జగన్‌… వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ నగదును రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇక అదే రోజున మధ్యాహ్నం తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు సీఎం జగన్‌. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news