రాహుల్‌ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు… వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నిరసనలు

-

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు వరుసగా విమర్శలకు దిగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల రాహుల్ అమెరికా పర్యటనలో దేశం పరువు తీసేలా కామెంట్స్ చేయడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.తాజాగా రాహుల్‌కు కూడా ఇందిరా గాంధీకి పట్టిన గతే పడుతుందని బీజేపీ నేత తన్వీందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలకు దిగింది.

ధర్నాలు చేపట్డంతో పాటు బీజేపీ నేతల దిష్టిబొమ్మల దహనం చేయాలని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. హన్మకొండలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే ధర్నాలో ఆయన మధ్యాహ్నం పాల్గొంటారు.అంతేకాకుండా, బీజేపీ నేతల కామెంట్స్‌కు గట్టిగా బదులివ్వాలని పీసీసీ చీఫ్ కాంగ్రెస్ నేతలకు పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని రాష్ట్ర కాంగ్రెస్ గట్టిగా బదులిచ్చింది.

 

Read more RELATED
Recommended to you

Latest news