రాజీనామాకు కారణాలు బయటపెట్టిన బాలినేని..!

-

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి బేటీ అయ్యారు. నోవాటెల్ నుంచి నేరుగా మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు బాలినేని. నిన్న వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పంపారు. అందులో పలు కీలక అంశాలను ప్రస్తావించారు.

Former minister Balineni Srinivasa Reddy met Jana Sena leader and Deputy CM Pawan Kalyan today

గత కొద్ది రోజులుగా వైసీపీ అధిష్టానం పై అసంతృప్తితో ఉన్నారు. ఒంగోలు నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలినేని సీనియర్ నేతగా కొనసాగారు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో మళ్లీ గెలిచి వైసీపీ ప్రభుత్వం తొలి రెండున్నరేల్లు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఒంగోల్ పార్లమెంట్ టికెట్ విషయంలో జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించి వార్తల్లోకి ఎక్కారు. పార్టీలో తనకు ప్రాధాన్యత దక్కకపోవడంతోనే వైసీపీకి గుడ్ బై చెప్పినట్టు వెల్లడించారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. పవన్ తో భేటీ అయ్యారు. పార్టీలోకి పవన్ ఆహ్వానించారని.. మంచి రోజు చూసుకొని జనసేనలో చేరనున్నట్టు వెల్లడించారు బాలినేని. 

Read more RELATED
Recommended to you

Latest news