లడ్డు ఇష్యూ పై నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన పోస్ట్..!

-

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం తిరుమల శ్రీవారి లడ్డు చుట్ట తిరుగుతున్న విషయం తెలిసిందే. గత ప్రభుత్వ హయంలో తిరుమల లడ్డులో జంతువుల కొవ్వుతో తాయారు చేసిన నెయ్యి వాడారు అని సీఎం చంద్రబాబు చెప్పిన తర్వాత పెద్ద దుమారం రేగింది. అయితే ఈ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. అయితే పవన్ కళ్యణ్ లడ్డు ఇష్యూ పై పెట్టిన ట్వీట్ ను కోట్ చేస్తూ నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన పోస్ట్ చేసారు.

అందులో ”డియర్ పవన్ కళ్యాణ్ గారు.. మీరు DCM గా ఉన్న రాష్ట్రంలో ఇది జరిగింది. దయచేసి విచారించండి .. దోషులను కనుగొని కఠిన చర్యలు తీసుకోండి. మీరు ఆందోళనలను ఎందుకు వ్యాపింపజేస్తున్నారు మరియు సమస్యను జాతీయంగా ఊదరగొడుతున్నారు.దేశంలో మనకు తగినంత మతపరమైన ఉద్రిక్తతలు ఉన్నాయి అని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. అయితే ప్రకాశ్ రాజ్ పోస్ట్ తో ప్రస్తుతం ఈ వ్యవహారం నేషనల్ లెవల్ లో వైరల్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news