గ్రూపు-1 పై బండి సంజయ్-రేవంత్ రెడ్డి డ్రామా ఆడుతున్నారు : కేటీఆర్

-

గ్రూపు-1 పై బండి సంజయ్-రేవంత్ రెడ్డి డ్రామా ఆడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రూప్ వన్ అభ్యర్థులను కనీసం చర్చలకు కూడా పిలవకపోవడం దుర్మార్గం అన్నారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్.. సీఎం రేవంత్ రెడ్డి కావాలనే ఆడుతున్న డ్రామా ఆడుతున్నారు.  బండి సంజయ్ ని పోలీస్ సెక్యూరిటీ ఇచ్చి మరి ర్యాలీ చేయిస్తున్నాడు రేవంత్ రెడ్డి.

కానీ మా బీఆర్ఎస్  నాయకులను మాత్రం అరెస్ట్ చేయిస్తారు.  బండి సంజయ్ ను చర్చలకు పిలిస్తే ఏం జరుగుతుంది.  బండి సంజయ్ ఏం చదువుకున్నాడు ఆయనకు పరీక్షల గురించి ఏం తెలుస్తుంది? అని ప్రశ్నించారు. గ్రూపు-1 అభ్యర్థులను చర్చలకు పిలవండి. కాబోయే ఆఫీసర్ల పట్ల సీఎం రేవంత్ రెడ్డి ఇలా వ్యవహరించడం దుర్మార్గం అన్నారు. జీవో నెం.29 పై మమ్మల్ని చర్చలకు పిలవకపోయినా పర్వాలేదు.. కానీ గ్రూపు-1 అభ్యర్థులను చర్చలకు పిలిచి వారితో చర్చించి పరీక్షలపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news