బిగ్ బ్రేకింగ్;ఏపీలో ఇవాళ ఒక్క రోజే 17 కరోనా కేసులు పాజిటివ్..!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఒక్క రోజే 17 నమోదు అయ్యాయి. ఏపీ వ్యాప్తంగా మొత్తం ఇప్పటి వరకు 40 మందికి కరోనా వ్యాధి సోకింది. ఢిల్లీ మత ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వారికే ఈ కరోనా బయటపడింది. 17 మందిలో ఎనిమిది మంది ప్రకాశం జిల్లా, అనంతపురానికి చెందిన వారు ఇద్దరు, ఐదుగురు గుంటూరు, ఒకరు కృష్ణా జిల్లా వాసి ఉన్నారు. నిన్న రాత్రి 9 గంటల నుంచి ఈ రోజు ఉదయం వరకు 164 మందిని పరీక్షించగా 147 మందికి నెగటివ్ వచ్చింది.

వీరు అందరూ కూడా ఇన్నాళ్ళు బయట తిరిగారు. దీనితో ఎవరు ఎవరికి కరోనా అంటించారు అనేది ఇప్పుడు అధికారులకు చుక్కలు చూపిస్తున్న ప్రశ్న. ఇన్నాళ్ళు వీళ్ళు అందరూ స్వేచ్చగా బయట తిరిగారు. వీరు చాలా ప్రాంతాల్లో ప్రయాణాలు కూడా చేసారు. దీనితో వాళ్ళు తిరిగిన ప్రదేశాలు ఏంటీ అనేది వారినే అడిగి తెలుసుకుంటున్నారు అధికారులు. ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 200 మంది వెళ్ళారు. వీరు అందరూ ఒంగోలు, చీరాల రైల్వే స్టేషన్లలో దిగి వెళ్ళారు.

Read more RELATED
Recommended to you

Latest news