బిగ్ బ్రేకింగ్; ఏపీలో మరో 10 కరోనా కేసులు..!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రోజు రోజుకి కరోనా వైరస్ కేసులు అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో తాజాగా 10 కేసులు బయటపడ్డాయి. కృష్ణా జిల్లాలో 5 కేసులు గుంటూరు జిల్లాలో 3 కేసులు, అనంతపురం ప్రకాశం జిల్లాలో చెరొక కేసు నమోదు అయింది. దీనితో కేసుల సంఖ్య 190 కి చేరుకుంది.

ఇంకా మిగిలిన పరిక్షలు రావాల్సి ఉందని వాటికి సంబంధించి ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. ఈ కేసులు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 190 కేసులు నమోదు కావడంతో రాష్ట్ర ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. నెల్లూరు, కృష్ణా, గుంటూరు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య అత్యంత వేగంగా పెరుగుతుంది. ఇంకా మిగిలిన జిల్లాల్లో ఫలితాలు రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news