రజినీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ని తట్టుకోలేకపోతున్న మాజీ మంత్రి ?

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తుంది. వైరస్ పరీక్షలు ప్రభుత్వం ఎక్కువగా నిర్వహించడంతో ఎక్కడికక్కడ కేసులు బయటపడుతున్నాయి. ఇలాంటి సందర్భంలో గుంటూరు జిల్లా రాజకీయాలు కరోనా కంటే చాలా హాట్ హాట్ గా సాగుతున్నాయి. సరిగ్గా 2019 సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు విదేశాల నుండి దిగింది విడుదల రజిని. సీనియర్ నాయకుడు మర్రి రాజశేఖర్ కుమార్తెగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన రజిని మొదట తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశించింది.Prathipati Pulla Rao Vs Vidadala Rajiniఅయితే అక్కడ బెర్త్ కన్ఫర్మ్ కాకపోవటంతో, జగన్ సమక్షంలో వైసీపీ పార్టీలో చేరి నరసరావుపేట వైసీపీ టికెట్ సాధించి, 2019 సాధించి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం నరసరావుపేట నియోజకవర్గం లో దూసుకుపోతుంది. ఈ క్రమంలో ఆమె ప్రత్యర్థి మాజీమంత్రి టీడీపీ నాయకుడు పత్తిపాటి పుల్లారావు రజిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రాజకీయానికి తట్టుకోలేక పోతున్నారట. ప్రస్తుతం తన తండ్రి మర్రి రాజశేఖర్ పేరు ఎక్కడ ప్రస్తావించకుండా, ప్రతి చోట తనదైన మార్కు రాజకీయం చేసుకుంటూ దూసుకుపోతోంది.

 

ఇటీవల నియోజకవర్గంలో రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం లను ఆకట్టుకునే విధంగా విడుదల రజనీ చేసిన ప్రయత్నాలకు మైనార్టీ ప్రజలంతా మురిసిపోయారు. మరొక పక్క కరోనా వైరస్ కారణంగా నియోజకవర్గంలో సమస్య ఉన్న ప్రతి చోటా వాలిపోతూ అంతా తానై వ్యవహరిస్తున్నారు. వ్యవహారం మొత్తం అదుపు తప్పెలా కనిపిస్తూ ఉండడం తో మాజీ మంత్రి పుల్లారావు రంగంలోకి దిగాలని ప్రయత్నాలు చేస్తున్న నియోజకవర్గంలో పెద్ద ఆధారాలు దొరకడం లేదట. అదే సమయంలో పుల్లారావు వాయిస్ ఎక్కడ వినిపించకుండా కూడా రజినీ మతిపోయే స్ట్రాటజీ లతో దూసుకుపోతున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news