మిరపలో తెగుళ్ల నియంత్రణ పద్ధతులు..

-

భారత దేశంలో అత్యధికంగా పండించే పంటలలో ఒకటి మిరప..అధ్యధిక లాభాలను కూడా అందించే పంట కూడా..అయితే ఈ పంటకు తెగుల్లు కూడా ఎక్కువే..ఆ తెగుల్లు నియంత్రణ పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

మొవ్వు కుళ్ళు తెగులు : ఇది తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. నారుమళ్ళు మరియు సాలు తోటల్లోనూ ఆశించి మొవ్వు లేదా చిగురు భాగం ఎండిపోతుంది. కాండం పై నల్లని నిర్దిష్ట ఆకారం లేని మచ్చలు ఏర్పడి క్రమేణా చారలుగా మారుతాయి. ఆకులపై వలయాలుగా నెకోటిక్‌ మచ్చలు ఏర్పడి పండుబారి రాలిపోతాయి.దీనివల్ల పంట తీవ్ర నష్టానికి గురి అవుతుంది..

తామర పురుగులు : రెక్కల పురుగులు ఆకుల అడుగుభాగాన చేరి రసాన్ని పీల్చడం వలన ఆకుల అంచులు పైకి ముడుచుకుంటాయి. ఆకులు, పిందెలు రాగి రంగులోకి మారి పూత, పిందె నిలిచిపోతుంది. దీని నివారణకు ఎకరానికి 300 గ్రాములు ఎసిఫేట్‌ లేదా 400 మిల్లీ లీటర్లు ఫిప్రోనిల్‌ లేదా స్పైనోశాడ్‌ 75 మిల్లీ లీటర్లు ఆకులు అడుగుభాగం తడిచేలా పిచికారీ చేయాలి.

తెల్ల నల్లి : తెల్లనల్లి పురుగులు ఆకుల రసాన్ని పీల్చడం వలన ఆకులు కిందికి ముడుచుకొని తిరగబడిన పడవ ఆకారంలో కనపడతాయి. ఆకుల కాడలు సాగి ముదురు ఆకుపచ్చగా మారుతాయి. నివారణకు ఎకరానికి ఒక లీటరు డైకోఫాల్‌ పిచికారి చేయాలి.

పేను బంక : పేనుబంక లేత కొమ్మలు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చడం వల్ల పెరుగుదల తగ్గిపోతుంది. తీయ్యటి పదార్థాన్ని విసర్జించటం వలన చీమల్ని ఆకర్షిస్తుంది. ఆకులు, కాయలు నల్లటి మసిపూసినట్లుగా మారిపోతాయి. నివారణకు ఎకరానికి మిథైల్‌డెమటాన్‌ 400 మిల్లీ లీటర్లు లేదా ఎసిఫేట్‌ 300 గ్రాములు చేయాలి. పిల్ల పురుగులు, మొగ్గలు, పూత, పిందెలను ఆశించి నష్టపరుస్తాయి. ఈ పురుగు సోకినా పూత ఎండి రాలిపోవడం వల్ల కాయలు ఏర్పడవు. నివారణకు ట్రైజోఫాల్‌ ఎకరానికి 250 మిల్లీ లీటర్లు పిచికారీ చేయాలి.

నారు కుళ్ళు తెగులు : లేత మొక్కల కాండం మెత్తబడి గుంపులు గుంపులుగా నారు చనిపోతుంది.మొలకెత్తిన వెంటనే ఒకసారి మరలా వారం రోజులకు ఒకసారి మూడు గ్రాముల కాపర్‌ ఆక్సీ క్లోరైడ్‌ లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి..వీటికి సంబందించి ఇంకేదైనా సందేహాలు ఉంటే వ్యవసాయ నిపునుల సలహా తీసుకోవడం మంచిది..

Read more RELATED
Recommended to you

Latest news