బిజినెస్ ఐడియా: బిజినెస్ చేయాలనుకుంటున్నారా? ఈ ఐడియా మీ కోసమే..

-

ప్రస్తుతం ఎక్కడ చూసిన రసాయనిక ఎరువుల వాడకం భారీగా పెరిగింది..పంటల దిగుబడి తగ్గడం మాత్రమే కాదు..తినే ఆహారం కూడా కలుషితం అవుతుంది.దాని వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.ఇలాంటి పరిస్థితుల్లో సాగు చేసే సమయంలో రసాయనిక ఎరువులు వాడకుండా సేంద్రియ ఎరువులు వేసి పంట సాగు చేస్తే ప్రజలు వాటిని కొనడానికి ఆసక్తి చూపుతారు. ఈ నేపథ్యంలో దానిని మనం బిజినెస్ గా ఎంపిక చేసుకోవచ్చు..అరటి కాండం పనికిరానిదిగా భావించి, దానిని కట్ చేసి విసిరివేస్తారు.

ఈ అరటి కాండం మీ ఆదాయ వనరుగా మారితే మాత్రం మంచి డబ్బులు ఆర్జించవచ్చు. అరటి పంటలు పండించే రైతులు సాధారణంగా దాని కాండం పారవేస్తారు. ఇది పర్యావరణం మరియు నేల రెండింటిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీంతో నేల సారం తగ్గుతుంది. కానీ ఈ కాండంను సేంద్రియ ఎరువుగా మార్చడం వల్ల మంచి లాభాలాను పొందవచ్చు..

కంపొస్ట్ ఎరువును ఎలా తయారు చేయాలి..

మీకు ఖాళీ స్థలం ఉంటే అందులో గొయ్యిని తవ్వాలి.అందులో అరటి కాండం వేయాలి. ఆ తర్వాత ఆవు పేడ, కలుపు మొక్కలను కాండంతోపాటు గుంతలో వేస్తారు. దీనితో పాటు డీకంపోజర్ కూడా స్ప్రే చేస్తారు. ఈ కాండం మరియు ఇతర పదార్థం సేంద్రీయ ఎరువుగా కుళ్ళిపోతుంది. దీనిని రైతులు తమ పొలాల్లో మంచి పంటలు పండించడానికి ఉపయోగించవచ్చు. మీరు దానిని మార్కెట్లోకి తీసుకెళ్లడం ద్వారా విక్రయించవచ్చు. భారీ లాభం పొందవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వం కూడా రసాయన ఎరువుల స్థానంలో సేంద్రియ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది..ఈ ఎరువులను వాడటం వల్ల మంచి దిగుబడిని పొందవచ్చు.. పైగా ఆరోగ్యం కూడా..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సేంద్రియ ఎరువు వాడేలా ప్రజలను ప్రోత్సహిస్తున్నాయన్నారు. దీని లక్షణాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇందుకు సంబంధించి రైతులకు శిక్షణ కూడా ఇస్తున్నారు…నేల సారం పెరగడం తో పాటుగా ప్రజల ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది..ఈ బిజినెస్ కు పెద్దగా ఖర్చులు కూడా ఉండవు.. వ్యవసాయ నిపుణుల సలహా తీసుకోని ప్రారంభించవచ్చు.. చాలా సింపుల్ మరియు అధిక లాభాలను అందించె బిజినెస్ అనే చెప్పాలి.. మీకు ఆసక్తి ఉంటే ట్రై చెయ్యండి..

Read more RELATED
Recommended to you

Latest news