చిక్కుల్లో పడ్డ సైరా.. సెట్స్ ధ్వంసం..!

-

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ గా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా సైరా నరసింహారెడ్డి. దాదాపు 200 ఏళ్ల క్రితం జరిగిన ఈ కథను తెరరూపం దాల్చుతున్నారు. ఇక ఈ సినిమా కోసం శేరిలింగంపల్లిలో రంగస్థలం సెట్స్ ను వాడుతున్నారు. రంగస్థలం కోసం వేసిన సెట్స్ సైరా కోసం వాడుతున్నట్టుగా రెవిన్యూ అధికారుల నుండి ఎలాంటి పర్మిషన్స్ తీసుకోలేదట.

దీనిపెఉ రెవిన్యూ అధికారులు సీరియస్ అయ్యారట. ఇది ఓ రకంగా భూ కబ్జా కిందకు వస్తుందని మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో చిత్రయూనిట్ పై కేసు పెట్టారట. అంతేకాదు రెవిన్యూ అధికారులు నిబంధనలు లేకుండా నిర్మించిన సైరా సెట్ ను కూల్చేశారని తెలుస్తుంది. మొదలైన నాటి నుండి సైరా యూనిట్ కు ఏదో ఒక అడ్డు తగులుతూనే ఉంది. ఇప్పుడు కొత్తగా రెవిన్యూ సమస్య వచ్చింది.

దీన్ని ఎలాగోలా సెట్ చేసుకునే అవకాశం ఉన్నా ప్రేక్షకుల్లో ఈ సినిమాపై నెగటివ్ ఇంప్రెషన్ పడేలా ఉంది. చిరు సరసన నయనతార నటిస్తున్న ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబులు నటిస్తున్నారని తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news