మెహబూబా తర్వాత అరణ్యం

-

పూరి తనయుడు హీరోగా ఆంధ్రాపోరి చేశాడు. అది అంతగా ఆకట్టుకోలేదని పూరి డైరక్షన్ లోనే మెహబూబా అంటూ వచ్చాడు. పూరి మార్క్ టేకింగ్ తో ఈసారి తనయుడితో హిట్ ట్రాక్ ఎక్కేస్తాడని అనేంత ఊపు చేసిన పూరి మళ్లీ సేం రిజల్ట్ అందుకున్నాడు. వరుస ఫ్లాపులవడం వల్ల తనయుడి కెరియర్ ను సరిగా ప్లాన్ చేయలేకున్నాడు పూరి జగన్నాథ్. మెహబూబా హిట్ అయితే ఆకాష్ పూరితోనే మరో లవ్ స్టోరీ చేయాలని చూశాడు కాని అది అటకెక్కింది.

ఇక లేటెస్ట్ గా ఆకాష్ పూరి బయట దర్శకుడితో సినిమా చేస్తున్నాడు. నూతన దర్సకుడు శ్రీకాంత్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడట ఆకాష్ పూరి. ఈ సినిమాకు అరణ్యం టైటిల్ ఫిక్స్ చేశారట. సినిమా మొత్తం అడివిలోనే రోడ్ జర్నీ కథతో వస్తుందట. సస్పెన్స్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమా కథ నచ్చడంతో ఓకే చెప్పాడట ఆకాష్.

మెహబూబాలో నటుడిగా మంచి మార్కులే సంపాదించిన ఆకాష్ ఈ అరణ్యం తో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి. ఈ సినిమా గురించి మిగతా డీటైల్స్ త్వరలో వెళ్లడవుతాయని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news