స్లీవ్ లెస్ టాప్ లో అలజడలు సృష్టిస్తున్న బుట్ట బొమ్మ..!

-

ప్రముఖ స్టార్ హీరోయిన్ బుట్ట బొమ్మ అలియాస్ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ఇటీవల హిందీలో సల్మాన్ ఖాన్, వెంకటేష్ లతో కలిసి కిసీకా భాయ్ కిసీకా జాన్ సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఏప్రిల్ 21న ఈ సినిమా విడుదలై పర్వాలేదు అనిపించుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న పూజా హెగ్డే తాజాగా కొన్ని ఫోటోలు అభిమానుల కోసం పంచుకోగా అవి చాలా వైరల్ అవుతున్నాయి. చాలా కాలం తర్వాత బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈమె కిసీకా భాయ్ కిసీకా జాన్ సినిమా పైన ఆశలు పెట్టుకుంది కానీ పెద్దగా అక్కడ వర్క్ అవుట్ కాలేదని చెప్పాలి.

మరొకవైపు ఈమె నటించినా రాధే శ్యామ్, ఆచార్య, బీస్ట్ వంటి చిత్రాల్లో నటించినప్పటికీ డిజాస్టర్ గా మిగిలింది. ఇక ఈ పరిణామాల మధ్య బుట్ట బొమ్మ కెరియర్ కాస్త ఆందోళనకరంగా మారిందని చెప్పాలి. ఇకపోతే మును ముందు కాలంలో ఒక సాలిడ్ హిట్ పడితే తప్ప.. ఈమె మళ్ళీ సక్సెస్ అవ్వలేదని చెప్పడంలో సందేహం లేదు. ఇక ప్రస్తుతం పూజా హెగ్డే త్రివిక్రమ్ ని నమ్ముకుందని చెప్పాలి ఎందుకంటే ప్రస్తుతం ఆమె చేతిలో త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న ఎస్ఎస్ఎంబి 28 చిత్రం మాత్రమే ఉంది. ఇక ఈ సినిమా పైన పూజా ఆశలు పెట్టుకుంది.. గతంలో కూడా త్రివిక్రమ్ డైరెక్షన్లో అరవింద సమేత , అల వైకుంఠపురం లో సినిమాలతో సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే.

ఇప్పుడు త్రివిక్రమ్ తో మరోసారి సక్సెస్ పొందుతాను అని భావిస్తోంది . ఇక చాలాకాలం తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబో సెట్ కావడం, పైగా మహేష్ తో పూజ రెండోసారి నటించే అవకాశం రావడంతో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా వచ్చే యేడాది జనవరి 13వ తేదీన విడుదల కానుంది.ఇక ఈమె మాత్రం శ్రీలంకకు వెళ్లి అక్కడ స్లీవ్ లెస్ టాప్ అందాలతో యువతను ఆకట్టుకుంటుంది ..బీచ్ లో తిరుగుతూ రచ్చ చేస్తుంది. మొత్తానికి అయితే ఈమె ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)

Read more RELATED
Recommended to you

Latest news