ఓటీటీకి సిద్ధమవుతున్న ఆది పురుష్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

-

ఇటీవల ప్రభాస్ నటించిన మైథాలజికల్ చిత్రం ఆది పురుష్.. భారీ అంచనాల మధ్య ఈనెల 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. హిందీ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఇక ప్రభాస్ అభిమానులు కూడా దర్శకుడి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.దాదాపు రూ.500 కోట్లు పెట్టి తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ప్రభాస్ రాముడిగా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ భామ కృతి సనన్ సీతగా నటించి మెప్పించింది.

ముఖ్యంగా రామాయణ ఇతిహాస కథ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో గ్రాఫిక్స్ మైనస్ గా నిలిచాయి. అంతేకాదు రావణాసురుడి పాత్రను చాలా తప్పుగా చూపించారని.. కొంతమంది అంటుంటే మరి కొంత మంది ఏకంగా రామాయణాన్ని పక్కన పెట్టి ఏదో హాలీవుడ్ సినిమా తరహాలో ఈ సినిమాను తెరకెక్కించారు అని మండిపడుతున్నారు. సినిమా ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రభాస్ కి ఉన్న క్రేజ్ కారణంగా మంచి ఓపెనింగ్స్ తో పాటు కలెక్షన్స్ కూడా రాబట్టింది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా ఓటిటి రిలీజ్ గురించి ఆసక్తికర వార్త ఒకటి నెట్ లో వైరల్ గా మారుతూ ఉండడం గమనార్హం.

ఆది పురుష్ ఓటిటి రిలీజ్ కోసం ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈ సినిమా ఓటిటి రిలీజ్ పై నిర్మాతలు ఒక నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. ఈ సినిమాను ఆగస్టు 15 న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఓటీటీ లో రిలీజ్ చేయాలని.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా రాబోతున్నట్లు సమాచారం. మరి ఈ సినిమా ఏ విధంగా ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news