ప్రతిష్టాత్మక మెరిల్ స్ట్రీప్ అవార్డును అందుకున్న బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్

-

ఎన్ని ఏళ్లయినా వన్నె తగ్గని అందం ఆమె సొంతం. తెరపై ఆమె కనిపిస్తే చాలు.. అభిమానించే ప్రేక్షకులు ఎంతో మంది ఉన్నారు. ఇంతకీ ఆమె ఎవరో ఇప్పటికే మీకు ఓ ఐడియా వచ్చి ఉంటుంది. ఆమే.. బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్. పెళ్లయి ఇన్ని సంవత్సరాలైనా ఒక బిడ్డకు తల్లి అయినప్పటికీ ఇప్పటికీ ఆమె అందం చెక్కు చెదరలేదు. అవును, అందుకనే కదా ఆమె విశ్వసుందరి అయింది. ఇక ఆమె అందమే ఇప్పటికే ఆమెకు ఎన్నో అవార్డులను తెచ్చి పెడుతోంది.

బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్‌ను అత్యంత ప్రతిష్టాత్మకమైన మెరిల్ స్ట్రీప్ అవార్డు లభించింది. ఇప్పటి వరకు ఈ అవార్డును అందుకున్న ఏకైక సెలబ్రిటీ ఐశ్వర్యారాయే కావడం అభిమానులను సంతోషానికి గురి చేస్తోంది. అమెరికా రాజధాని అయిన వాషింగ్టన్‌లో ఇటీవలే ఈ అవార్డును ఆమెకు ప్రదానం చేశారు. వుమెన్ ఇన్ ఫిలింస్ అండ్ టెలివిజన్ అవార్డుల కార్యక్రమంలో భాగంగా ఐష్‌కు ఈ అవార్డును అందించారు. అల‌నాటి ప్ర‌ముఖ హాలీవుడ్ న‌టి మెరిల్ స్ట్రీప్ పేరిట ప్ర‌వేశ‌పెట్టిన ఈ అవార్డును ఐష్ అందుకుంది.

ఇక ఈ అవార్డుల కార్యక్రమంలో దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌కు ఎమిరాల్డ్ అవార్డు దక్కింది. కాగా ఐష్ ఇటీవలే ఫన్నేఖాన్ అనే సినిమాలో నటించగా, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది. ఇక ప్రస్తుతం ఐష్ తన భర్త అభిషేక్‌తో కలిసి గులాబ్ జామున్ అనే సినిమాల్లో నటించనుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి.

Read more RELATED
Recommended to you

Latest news