అఖిల్ తో తప్పు తెలుసుకున్నా.. తారక్ సర్ ప్రైజ్ చేశాడు..!

-

అక్కినేని అఖిల్ నటించిన మిస్టర్ మజ్ను శుక్రవారం రిలీజ్ అవబోతుంది. వెంకీ అట్లూరి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. అఖిల్, హలో రెండు సినిమాలు తన కెరియర్ లో నిరాశపరచగా మిస్టర్ మజ్నుకి అఖిల్ కు ముందునుండి పాజిటివ్ టాక్ వచ్చింది.

ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్.టి.ఆర్ స్పీచ్ కూడా అదరగొట్టాడు. ఎన్.టి.ఆర్ చెప్పింది వాస్తవమే.. తాను అఖిల్ తర్వాత చాలా స్ట్రగుల్ అయ్యాను.. తప్పులను తెలుసుకున్నానని చెప్పాడు అఖిల్. ఎన్.టి.ఆర్ తన గురించి అలా మాట్లాడతాడని అసలు ఊహించలేదని. ఆయన మాటలు తనని మరింత ఉత్సాహపరచాయని అన్నాడు అఖిల్. ఇక మిస్టర్ మజ్ను యూత్ ఫుల్ మూవీ అని.. అన్ని ఎమోషన్స్ ఈ సినిమాలో ఉంటాయని చెప్పాడు. మరి అఖిల్ ఖాతాలో తొలి హిట్ సినిమాగా మిస్టర్ మజ్ను నిలుస్తుందా లేదా అన్నది తెలియాలంటే మరి కొద్ది గంటలు వెయిట్ చేస్తే సరిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news