బన్నీ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ చెప్పిన ‘అల వైకుంఠపురములో’ టీమ్….!!

-

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన గత రెండు సినిమాలైన డీజే, నా పేరు సూర్య రెండూ కూడా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో కొంత ఆలోచనలో పడ్డ బన్నీ, ఎట్టకేలకు త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయాలని నిశ్చయించి, ఫైనల్ గా అలవైకుంఠపురములో సినిమాలో నటించడానికి సిద్ధం అయ్యాడు. ఇక షూటింగ్ పూర్తి చేసుకుని ఇటీవల సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించడంతో బన్నీతో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ముందుగా రిలీజ్ అయిన ఈ సినిమాలోని సాంగ్స్ కు శ్రోతల నుండి విశేషమైన స్పందన లభించడం, అలానే అనంతరం సినిమా కూడా ఆశించిన దానికంటే మంచి సక్సెస్ ని అందుకోవడంతో ఇటీవల విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ లో గ్రాండ్ సక్సెస్ మీట్ ని నిర్వహించింది సినిమా యూనిట్. అయితే ఫ్యాన్స్ కోసం నేడు తిరుపతిలో కూడా ఒక స్పెషల్ సక్సెస్ మీట్ ని నిర్వహించేందుకు సిద్ధమైంది అల మూవీ యూనిట్. అయితే నేడు హఠాత్తుగా బన్నీ మేనమామ అయిన ముత్తంశెట్టి ప్రసాద్ హఠాన్మరణంతో ఆ ఈవెంట్ ని రద్దు చేస్తున్నట్లు సినిమా యూనిట్ తెలిపింది.

 

వాస్తవానికి ఈ ఈవెంట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న బన్నీ ఫ్యాన్స్ కి ఇది చేదు వార్తే అని చెప్పాలి. అయితే ఈవెంట్ పూర్తి గా రద్దు అయిందా, లేక మరికొద్దిరోజుల తరువాత మళ్ళి జరుగుతుందా అనే దానిపై అల యూనిట్ నుండి పూర్తి స్పష్టత రావలసి ఉంది. బన్నీ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను మంచి ఫ్యామిలీ, కమర్షియల్ ఎంటర్టైనర్ గా త్రివిక్రమ్ తెరకెక్కించడం జరిగింది. గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ స్వరాలు సమకూర్చగా పీఎస్ వినోద్ ఫొటోగ్రఫీని అందించడం జరిగింది……!!

Read more RELATED
Recommended to you

Latest news