యాక్షన్ సీన్స్,  డైలాగ్స్ తో అదరగొట్టిన ‘అల వైకుంఠపురములో’ టీజర్….!!

-

బన్నీ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో ముచ్చటగా మూడవసారి తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురములో’. హృదయానికి హత్తుకునే ఒక మంచి పాయింట్ తో దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో బన్నీ ఒక సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా నటిస్తుండగా ఆయన తండ్రి పాత్రలో మురళి శర్మ నటిస్తున్నారు. కెరీర్ లో రెండవ సారి పూజ హెగ్డే బన్నీ సరసన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ అత్యంత భారీ వ్యయం మరియు అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన మూడు సాంగ్స్ కూడా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ సంపాదించడంతో పాటు అందులో సామజవరగమనా, రాములో రాములో సాంగ్స్ అయితే యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ మరియు లైక్స్ పరంగా సరికొత్త రికార్డ్స్ ని సృష్టించడం జరిగింది. ఇక ఈ సినిమా అధికారిక ఫస్ట్ లుక్ టీజర్ ని కాసేపటి క్రితం రిలీజ్ చేసింది సినిమా యూనిట్. టీజర్ ని బట్టి చూస్తుంటే సినిమా మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్నటు తెలుస్తోంది. ముందుగా ‘మీ నాన్న నిన్ను కొత్త పెళ్లి కూతురిని దాచినట్టు దాచాడురా’ అనే బ్యాక్ గ్రౌండ్ వాయిస్ తో వచ్చే డైలాగ్ తో టీజర్ మొదలవుతుంది. పూజ హెగ్డే, మురళి శర్మ, సుశాంత్, టబు, జయరాం, సముద్రఖని వంటి నటులను టీజర్ లో చూపించారు.

ఇకపోతే టీజర్ చివర్లో ‘మీరు ఇప్పుడే కార్ దిగారు, నేను ఇప్పుడే క్యారెక్టర్ ఎక్కాను’ అంటూ బన్నీ పవర్‌ఫుల్ గా చెప్పే డైలాగ్ అదిరిపోయింది. ఆకట్టుకునే విజువల్స్, ఫైట్స్, యాక్షన్, రొమాంటిక్ సీన్స్ తో రూపొందిన ఈ టీజర్ ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకెళ్తోంది. దీనితో సినిమాపై ఇప్పటివరకు ఉన్న అంచనాలు మరింతగా పెరిగాయి అనే చెప్పాలి. సీనియర్ నటి టబు బన్నీ సోదరిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. మరి సంక్రాంతి కానుకగా 2020 జనవరి 12న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఎంత వరకు సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి…..!!

Read more RELATED
Recommended to you

Latest news