ఇద్దరు పిల్లల తల్లివి.. పొట్టిబట్టలవసరమా?..నెటిజన్ ప్రశ్నకు అనసూయ దిమ్మదిరిగిపోయే ఆన్సర్..

-

టాలీవుడ్ బిజీయెస్ట్ యాక్ట్రెస్‌గా అనసూయ భరద్వాజ్ ప్రజెంట్ కొనసాగుతున్నారు. ఓ వైపు బుల్లితెరపైన యాంకరింగ్ చేస్తూనే మరో వైపున వెండితెరపైన కనబడుతున్నారు. పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్న ఈమెకు సోషల్ మీడియాలోనూ బాగానే ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే ఆమె కూడా తన సోషల్ మీడియా అకౌంట్స్ లో తన పర్సనల్ విషయాలు, లేటెస్ట్ ఫొటోలు షేర్ చేస్తుంటుంది. కాగా, ఆమె షేర్ చేసిన ఫొటోపై అభ్యంతరం తెలుపుతూ ఓ నెటిజన్ అభ్యంతరం తెలిపాడు.

ఈ క్రమంలోనే సదరు నెటిజన్ అనసూయపై నెగెటివ్ గా కామెంట్స్ చేశాడు. ఈ విషయమై ఆమెను ట్యాగ్ చేస్తూ క్వశ్చన్ చేయగా, సదరు వ్యక్తికి దిమ్మదిరిగిపోయే ఆన్సర్ ఇచ్చింది అనసూయ భరద్వాజ్. ‘అనసూయ గారు మీరు ఇద్దరు పిల్లల తల్లి ఇంకా ఇలాంటి పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటావా.. తెలుగు ఆడపడుచులు పరువు తీస్తున్నావు’ అని అన్నాడు. దాంతో ఆ ట్వీట్ కు స్పందించింది అనసూయ. ‘దయచేసి మీరు మీ పనిని చూసుకోండి నన్ను నా పనిని చేసుకోనివ్వండి.. మీరు ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారు’ అని అదిరిపోయే కౌంటర్ ఇచ్చేసింది.

అనసూయ రిప్లయి చదివి నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒకరి గురించి మరొకరు నెగెటివ్ గా మాట్లాడొద్దని ఈ క్రమంలోనే నెటిజన్లు సూచిస్తున్నారు. అనసూయ ప్రస్తుతం ‘పక్కా కమర్షియల్, రంగమార్తాండ’ చిత్రాల్లో నటిస్తోంది. ఆమె నటించిన ‘ఖిలాడీ, భీష్మ పర్వం’ ఫిల్మ్స్ ఇటీవల విడుదల కాగా, మెగాస్టార్ ‘ఆచార్య’ మూవీ ఈ నెల 29న విడుదల కానుంది. ‘భీష్మపర్వం’ చిత్రంతో ఈమె మాలీవుడ్ (మలయాళ) ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇఛ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news