సమంతకు మరో షాక్.. కోలుకుంటుందా..?

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా దాదాపు దశాబ్ద కాలంగా తన హవా కొనసాగిస్తూ నెంబర్ వన్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలెంటెడ్ బ్యూటీగా మరింత పాపులారిటీ దక్కించుకున్న ఈమె గ్లామరస్ పాత్రలకే పరిమితం అయింది. ఈ మధ్యకాలంలో ఎన్నో ప్రయోగాలు చేస్తూ దూసుకుపోతున్న ఈమె లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో కూడా అలరిస్తోంది. తాజాగా యశోద సినిమాతో హిట్టు అందుకున్న సమంత శాకుంతలం సినిమాతో మళ్ళీ మన ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో వసూలు రాబట్టలేదు.

ఈ నేపథ్యంలోనే ఆమెకు షాక్ మీద షాక్ తగులుతున్నట్టు తెలుస్తుంది. సినిమా ఐదు రోజుల్లో ఎంత కలెక్షన్స్ సాధించిందో ఇప్పుడు ఒకసారి చూద్దాం.. ఇకపోతే గుణ టీం వర్క్స్ బ్యానర్ పై నీలిమ గుణ నిర్మించిన ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించారు . మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాలో సమంత లీడ్రోల్ పోషించగా.. దేవి మోహన్ లీడ్ గా నటించారు.ఇందులో గౌతమి, ప్రకాష్ రాజ్, మోహన్ బాబు , మధుబాల , అనన్య నాగళ్ళ, సచిన్ ఖేడ్కర్ తదితరులు ఈ సినిమాలో నటించారు.

ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. నైజాంలో రూ.4.5 కోట్లు , సీడెడ్ లో రూ.1.20 కోట్లు , ఆంధ్రాలో కలిపి రూ.6.50 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాలలో రూ.12.20 కోట్లకు అమ్ముడు కాగా వేరే భాషల్లో రూ.4కోట్లు, ఓవర్సీస్ లో కలిపి రూ.1.8 కోట్లతో.. మొత్తం కలిపి రూ.18 కోట్ల బిజినెస్ మాత్రమే జరిగింది. ఐదు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో కేవలం 12 లక్షల షేర్ మాత్రమే వసూలు అయింది. రోజు ఈ చిత్రానికి రూ.4.04 కోట్ల షేర్ తో పాటు రూ.8.40 కోట్ల గ్రాస్ వసూల్ అయింది. ఇంకా రూ. 15 కోట్లు రాబడితే తప్ప ఈ సినిమా క్లీన్ హీట్ అవ్వదని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news