అనుష్క ‘నిశబ్దం’ గా రిలీజ్ డేట్ అనౌన్స్ ..!

-

టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ స్వీటి అనుష్క భాగమతి సినిమా తర్వాత మళ్ళీ కనిపించనేలేదు. వరసగా సినిమాలతో ప్రేక్షకులని అలరించిన స్వీటి చాలా గ్యాప్ తీసుకోవడంతో ఫ్యాన్స్ బాగా డిసప్పాయింట్ గా ఉన్నారు. అందుకే ‘నిశబ్దం’ అనే మల్టీ లాంగ్వేజ్ సినిమాని అనౌన్స్ చేసి అందరికి స్వీట్ షాకిచ్చింది. అయితే ఈ సినిమా షూటింగ్ చక చక జరిగింది గాని రిలీజ్ విషయంలో మాత్రం అవాంతరాల మీద అవాంతరాలు. ఇదుగో అదుగో అంటూ ఊరించిన చిత్ర బృందం నిశబ్దం సినిమా విడుదల తేదీని అఫీషియల్ గా ప్రకటించారు.

 

గత ఏడాది విడుదల చేయాలనుకున్న ఈ సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. అది కూడా తూచ్ .. అంటూ తాజాగా మళ్ళీ ఏప్రిల్ 2న ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించి పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో అనుష్కను మూగ.. చెవిటి అమ్మాయి పాత్రలో కనిపించబోతున్నట్లుగా టీజర్ లో హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

 

ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు ‘నిశబ్దం’ సినిమాతో అనుష్క రాబోతుందని న్యుస్ రాగానే స్వీటీ ఫ్యాన్స్ కి ఉత్సాహం పెరిగిపోయింది. బాహుబలితో ఆల్ ఇండియా క్రేజ్ ను దక్కించుకున్న అనుష్క నిశబ్దం సినిమాతో ఒకేసారి నాలుగు భాషల్లో సందడి చేయబోతుంది. హిందీలో ఈ సినిమాను సైలెన్స్ అనే టైటిల్ తో విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే మాధవన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించగా గోపీ సుందర్ సంగీతంను అందించాడు. ఇక ఈ సినిమాలో అనుష్క తో పాటు , అంజలి, షాలిని పాండే ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news