టాలీవుడ్‌ లో మరో విషాదం.. రచయిత కీర్తి సాగర్ మృతి

-

టాలీవుడ్ చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా కరోనా అలాగే ఇతర కారణాల వల్ల చాలామంది ప్రముఖ నటులు తుది శ్వాస విడిచారు. ఈ నేపథ్యంలోనే…తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమలో మరో తీవ్ర చోటు చేసుకుంది. తాజాగా సినీ కథా రచయిత కీర్తి సాగర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

ఒక్క ఛాన్స్ అంటూ సినిమా ఆఫీస్ ల చుట్టూ తిరిగిన కథా రచయిత కీర్తి సాగర్… వందలాది కథలు రాసి అవకాశాల కోసం ఎదురు చూపులు చూశారు. తాను రాసిన కథలు ఎవరూ వినడం లేదన్న బాధతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు కథా రచయిత కీర్తి సాగర్. గది నిండా కథలు.. మృతదేహాన్ని తీసుకు వెళ్లేందుకు ఎవరూ లేకపోవడంతో మార్చురీలోనే మృత దేహం ఉంది. హైదరాబాద్‌ ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news