బాలకృష్ణ ఒంటరి వారయ్యారా..అందుకేనా ఇలా..?

-

నటసింహ బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఆయన రూటే సపరేట్.. సినిమాలు హిట్ అయినా.. ఫ్లాప్ అయినా ఒకే విధంగా ఉంటారు. జయాపజయాలు దైవాధీనాలు అని భావించిన వారిలో ఈయన కూడా ఒకరు. అయితే ప్రస్తుతం బాలయ్య నుంచి వస్తున్న సినిమా వీరసింహారెడ్డి.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి అప్డేట్ సినిమా పై భారీ అంచనాలను పెంచేసింది. అయితే సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఇతర సినిమాల వీడియోలకు వస్తున్న స్థాయిలో వ్యూస్ లైక్స్ మాత్రం వీరసింహారెడ్డి సినిమా కంటెంట్ కు రావడం లేదు.

ఈ విషయంలో బాలయ్య అభిమానులు ఒకింత ఫీలవుతున్నారు.ఇకపోతే వాల్తేరు వీరయ్య సినిమాకు మెగా అభిమానుల సపోర్టుతో పాటు రవితేజ అభిమానుల సపోర్టు కూడా లభిస్తోంది. అందుకే వీరసింహారెడ్డి సినిమాతో పోల్చితే వాల్తేరు వీరయ్యకు భారీ స్థాయిలో పాపులారిటీ దక్కుతోందని చెప్పాలి. అందుకే వీర సింహారెడ్డి సినిమా విషయంలో ఇతర హీరోల ఫ్యాన్స్ సపోర్ట్ విషయంలో మాత్రం అలా జరగడం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే బాలయ్య ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ తీసుకుంటే మంచిదని కొంతమంది సూచిస్తున్నారు.

ముఖ్యంగా ఎన్టీఆర్ , బాలకృష్ణ కలిస్తే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. ఈ విషయాలు బాలయ్య దృష్టికి వస్తే బాలయ్య ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారనే ప్రశ్నలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తానికైతే ఎవరూ లేని ఒంటరివాడు అయ్యాడు అంటూ కూడా వార్తలు వినిపిస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే బాలయ్య కెరీర్ కు వీర సింహారెడ్డి సినిమా అటు కెరియర్ పరంగా ఇటు వ్యక్తిగత జీవితంలో కీలకము కానుంది. జనవరి మొదటి వారంలో అన్ స్టాపబుల్ షోలో వీరసింహారెడ్డి టీం సందడి చేయనుంది. ఇందులో శృతిహాసన్, గోపీచంద్ వచ్చే అవకాశం ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో విజయం దక్కించుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news