సాయి పల్లవి క్షమాపణలు చెప్పాల్సిందే..లేకుంటే సినిమాలు అడ్డుకుంటాం !

-

టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సాయి పల్లవి వాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలి… లేనిపక్షంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమె సినిమాలు అడ్డుకుంటామని హెచ్చరించారు యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ కె. శివ కుమార్. గో మాత, గో రక్షకుల పై హీరోయిన్ సాయి పల్లవి చేసిన వాఖ్యలను యుగ తులసి ఫౌండేషన్ ఖండించిందని.. సాయి పల్లవి వెంటనే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఆమె దేశవ్యాప్తంగా పాపులర్ కావడానికి ఈ తరహా వాఖ్యలు చేయడం సమంజసం కాదని..ప్రాణాలు పణంగా పెట్టి..హిందువుల దైవం అయిన.. గో మాత ను రక్షించుకుంటున్నామని మండిపడ్డారు. పూర్తి అవగాహన లేకుండా సాయి పల్లవి మాట్లాడుతుందని.. బేషరతుగా సాయిపల్లవి క్షమాపణ చెప్పాలన్నారు.

లేనిపక్షంలో సాయి పల్లవి సినిమాలు అడ్డుకుంటాం… సాయిపల్లవి వల్ల ప్రొడ్యూసర్లు నష్టపోతారని పేర్కొన్నారు. బక్రీద్ సందర్భంగా.. గో హత్యలు అడ్డుకోవాలని.. ఒవైసీ ఆదేశాలుతో ప్రభుత్వం పనిచేయకూడదని పేర్కొన్నారు. ఒవైసీ దారుసలాం ఆదేశాలను, ప్రభుత్వ,పోలీసులు అనుగుణంగా పనిచేస్తే ఖబర్దార్ అని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news