ప్రభాస్ ఫ్యాన్స్ కు షాక్..వివాదంలో ఆదిపురుష్ సినిమా !

-

ప్రభాస్ ఫ్యాన్స్ కు బిగ్‌ షాక్ తగిలింది. ఆదిపురుష్ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఆదిపురుష్ సినిమాపై అలహాబాద్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం పిటిషన్ దాఖలు అయింది. కుల్దీప్ తివారీ…ప్రజా ప్రయోజనం వ్యాజ్యం పిటిషన్ దాఖలు చేశారు.

సెన్సార్ బోర్డు నుండి సర్టిఫికెట్ పొందకుండానే చిత్ర నిర్మాతలు సినీమా ప్రోమోను విడుదల చేశారని, ఇది నిబంధనలను ఉల్లంఘించడమేనని పిటిషన్ లో పేర్కొన్నారు కుల్దీప్ తివారీ. పిటిషన్ పై స్పందించాల్సిందిగా సెన్సార్ బోర్డుకు నోటీసులు జారీ చేసింది అలహాబాద్ హైకోర్టు.

కేసు విచారణను ఫిబ్రవరి 21వ తేదీకి వాయిదా వేసింది బెంచ్. ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజేష్ బిందాల్ ,జస్టిస్ బిఆర్ సింగ్ లతో కూడిన ధర్మాసనం విచారించింది. అయితే, ఫిబ్రవరి 21వ తేదీన ఎలాంటి తీర్పు ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news