బిగ్ బాస్: చివరి నిమిషంలో కంటెస్టెంట్లను మార్చిన బిగ్ బాస్..!

-

వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో గా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ ప్రస్తుతం 6 సీజన్ జరుపుకోవడానికి సిద్ధంగా ఉంది సెప్టెంబర్ 4వ తేదీ నుంచి ప్రసారం కానున్న ఈ బిగ్ బాస్ సీజన్ సిక్స్ కి బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ లను ఎవరెవరిని తీసుకొచ్చారు.. ఈసారి బిగ్ బాస్ సిక్స్ లో సందడి ఎలా ఉండబోతోంది.. ఇలా అన్ని విషయాలపై వార్తలు వైరల్ అవుతూ ఉండడం గమనార్హం. ఇక మొన్నటి వరకు కొంతమంది పేర్లు వినిపించగా చివరి నిమిషంలో కంటెస్టెంట్ల పేర్లు మార్చి అందరికీ షాక్ ఇచ్చింది బిగ్ బాస్.. ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరెవరు కంటెస్టెంట్ గా వెళ్లబోతున్నారు అనే విషయాన్ని ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

ఇకపోతే ఎప్పటిలాగే ఈసారి కూడా బిగ్ బాస్ 6 సీజన్ కి హోస్టుగా నాగార్జున చేయబోతున్నారు. ఈ సీజన్లో ఈసారి 17 మందిని ఫైనల్ చేశారట బిగ్ బాస్.అందులో 15 మందిని ఒకేసారి బిగ్ బాస్ హౌస్ లోకి పంపించనుండగా మిగతా ఇద్దరి కంటెంట్లను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ప్రవేశ పెట్టబోతున్నట్లు సమాచారం. ఇక ఎవరెవరు కంటెస్టెంట్ గా ఉన్నారు అనే విషయానికి వస్తే ఉదయభాను.. నటుడు బాలాదిత్య ,సుదీప పింకీ, నేహా చౌదరి , ఆదిరెడ్డి, ఇనయా సుల్తానా, వర్షిని, సింగర్ రేవంత్, చలాకి చంటి, నందు, శ్రీహాన్ సింగర్ మోహన భోగరాజు, యాంకర్ ప్రత్యూష, కొరియోగ్రాఫర్ పప్పీ మాస్టర్ , సంజనా చౌదరి , జబర్దస్త్ అప్పారావు, గీతూ రాయల్, మెరీనా, కీర్తి, ఫైమా వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. ఎలాగో ఈరోజు సాయంత్రం బిగ్ బాస్ సీజన్ 6 ప్రసారం కానున్న నేపథ్యంలో ఎవరెవరు ఎంట్రీ ఇవ్వనున్నారు సాయంత్రం 6 గంటలకు తెలిసిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news