బిగ్ బాస్: శ్రీ సత్య పెళ్లి క్యాన్సిల్ అవ్వడానికి కారణం..?

-

బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్న శ్రీ సత్య హౌస్ లో ఉండే పద్ధతి గురించి అందరికీ తెలిసిందే.. ఇక ఆమె తినడానికి , పడుకోవడానికి మాత్రమే వచ్చినట్టుగా బిగ్ బాస్ ఆమెకు సంబంధించిన విజువల్స్ కూడా చూపిస్తున్నాడు. ముఖ్యంగా వీకెండ్ ఎపిసోడ్ వచ్చేసరికి హోస్ట్ నాగార్జున శ్రీ సత్యను నేరుగానే అడిగేసాడు. ఇక తిండి మీద , నిద్ర మీద పెట్టే శ్రద్ధ సగం ఆట మీద కూడా పెట్టాలంటూ నాగార్జున కామెంట్లు చేశారు. ఇకపోతే తోటి కంటెస్టెంట్లతో కూడా శ్రీ సత్య సరిగ్గా మాట్లాడటం లేదు అని కంప్లైంట్ కూడా ఉంది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ తోటి కంటెస్టెంట్ లు కూడా ఆమెను నామినేట్ చేశారు.

ఇక హౌస్ లో ఆమె ఇలా ప్రవర్తించడం వెనుక కేవలం ఆమె ఆటిట్యూడ్ కారణమని కొంతమంది అంటుంటే.. ఆమె తనకు ఆటిట్యూడ్ లేదు.. గతం నన్ను చాలా డిస్టర్బ్ చేసింది .. దాని నుండి బయటపడడానికి సమయం పడుతుంది అంటూ తెలియజేస్తోంది. ఇకపోతే శ్రీ సత్య.. పవన్ రెడ్డి అనే వ్యక్తిని గతంలో ప్రేమించిన విషయం తెలిసిందే. ఇద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ వీరు నిశ్చితార్థం జరిగి పెళ్లి వరకు వెళ్లలేదు. ఇక మధ్యలోనే వీరు ఎవరూ ఊహించని విధంగా విడిపోయి పెళ్లి కూడా క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. ఇకపోతే శ్రీ సత్య పెళ్లి ఆగిపోవడానికి గల కారణం ఏమిటి అనే విషయం పై శ్రీ సత్య స్పందిస్తూ పవన్ రెడ్డి తనను మోసం చేశాడని ఆరోపించింది.

కానీ పవన్ రెడ్డి మాత్రం ఆమె మాటలను తోసిపుచ్చాడు. ఆమె ఒక వెర్షన్ మాత్రమే.. నిజంగా మోసం చేయాలనుకుంటే పెళ్లి వరకు తీసుకొచ్చేవాడిని కాదు కదా అంటూ కూడా ఆయన తెలిపాడు. ఏదీ ఏమైనా పెళ్లి వరకు వచ్చిన పవన్ రెడ్డి, శ్రీ సత్యల పెళ్లి మధ్యలోనే ఆగిపోవడం చాలా విషాదకరమని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news