Breaking: చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత

-

చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, డైరెక్టర్ ప్రతాప్ పోతెన్ కన్నుమూశారు. చెన్నై లోని తన నివాసంలో విగతజీవిగా కనిపించారు. ఆయన మలయాళం, తమిళం, తెలుగు లో ఎన్నో సినిమాలు చేశారు. నటుడిగా, డైరెక్టర్ గా, నిర్మాతగా పేరుతెచ్చుకున్నారు ప్రతాప్. తెలుగులో ఆకలిరాజ్యం, కాంచన, మరోచరిత్ర, వీడెవడు లాంటి సినిమాల్లో నటించారు.

అక్కినేని నాగచైతన్య సినిమాకు దర్శకత్వం కూడా వహించారు. 1985 లో సీనియర్ నటి రాధికని పెళ్లి చేసుకున్నారు ప్రతాప్. కాగా 1986 లోనే విడాకులిచ్చారు. ప్రతాప్ పోతేన్ కి బహుభాషా నటుడిగా గుర్తింపు ఉంది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో 100కు పైగా చిత్రాల్లో నటించారు. ఆయన గుండెపోటుతో మరణించినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news