బాలయ్య పై చిరంజీవి పై చేయి సాధించాడా..!!

-

ఈ సంక్రాంతి కి రెండు సినిమాలు సింహలు లాగా తలపడ బోతున్నాయి. అవే బాలయ్య బాబు నటించిన వీర సింహ రెడ్డి మరియు చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలు. మొదటి నుండి ఈ రెండు సినిమాలు చాలా పోటీ వాతావరణం లో పోటీ పడుతున్నాయి. చిరు మూవీ కు దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా, బాలయ్య బాబు మూవీ కు తమన్ సంగీతం అందిస్తున్నారు.

ఇక గతంలో విడుదల చేసిన  పాటల విషయంలో కూడా పోటీ నడిచింది. ఈ పాటలలో ఎవరికి ఎక్కువ ఆకట్టుకున్నాయి, ఎన్ని లైక్ లు వచ్చాయి, వ్యూస్ వచ్చాయి అనే వాటిపై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య వాదోపవాదాలు జరిగాయి. ప్రస్తుతం మళ్లీ రెండు సినిమాల ట్రైలర్స్ రిలీజ్ కావడం తో మరో సారి సోషల్ మీడియాలో హడావుడి మొదలు అయ్యింది.

నిన్న విడుదల అయిన చిరంజీవి వాల్తేరు వీరయ్య కేవలం 15 గంటల్లోనే 10 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది. 400 ప్లస్ లైక్స్ ను దక్కించుకుంది. ఇక బాలయ్య బాబు నటించిన’వీరసింహారెడ్డి’కి 14 గంటల్లో కేవలం 5 మిలియన్స్ వ్యూసే దక్కాయి. దీనితో మరోసారి చిరంజీవి బాలయ్య బాబు మూవీ పై పై చేయి సాధించాడని చిరు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news