Prabhas: ఎన్టీఆర్ తర్వాత ఆయనకే ఆ క్రేజ్..ప్రభాస్‌పై ముఖ్యమంత్రి ప్రశంసల వర్షం..

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పైన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రశంసల వర్షం కురిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. సదరు వీడియోలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ తెలుగు చిత్ర సీమ భారత సినిమాకు దిశానిర్దేశం చేస్తోందని కొనియాడారు.

 

తెలుగు చిత్ర సీమ బాలీవుడ్ ను మించిందని ఈ సందర్భంగా తెలిపారు. పూర్వం సీనియర్ ఎన్టీఆర్ ను ప్రజలు గుర్తించేవారని, ఆయన తర్వాత మళ్లీ ప్రభాస్ కు ఆ గౌరవం దక్కిందన్నారు. ‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ అందరి ఫేవరెట్ హీరో అయిపోయారని వివరించారు. ప్రభాస్ ను చిన్న పిల్లలు కూడా గుర్తిస్తున్నారని అన్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీ భారతీయ సినిమా గర్వించే స్థాయిలో దూసుకెళ్తున్నదని అన్నారు. మధ్యప్రదేశ్ సీఎం మాటలు విని ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇకపోతే ఇటీవల సమతామూర్తి విగ్రహా ఆవిష్కరణ సందర్భంగా ఆ కార్యక్రమానికి హాజరైన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా తెలుగు సినిమా భారతదేశానికి దిశా నిర్దేశం చేస్తోందని పేర్కొన్న సంగతి అందరికీ విదితమే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ ఫిల్మ్ ఇటీవల విడుదలైంది. అయితే, ఈ పిక్చర్ అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ప్రభాస్ ప్రస్తుతం‘సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్’ సినిమాలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news