డైరెక్టర్ పూరి జగన్నాథ్ పై పోలీస్ కేసు నమోదు !

-

మేడిపల్లి పోలీస్ స్టేషన్లో డైరెక్టర్ పూరి జగన్నాథ్ పై ఫిర్యాదు ఇచ్చారు. డబల్ ఇస్మార్ట్ సినిమా వివాదంపై ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకులు. రామ్ పోతినేని హీరోగా డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో .. ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.కాగా ఈ సినిమా నుంచి మంగళవారం మార్ ముంతా.. ఛోడ్ చింతా అనే లిరికల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

Complaint against Director Puri Jagannath at Medipally Police Station

కాగా పాట కొద్ది క్షణాల్లోని తెలుగు ప్రేక్షకులకు మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రాంత వాసులకు విపరీతంగా నచ్చేసింది. మాస్ స్టేప్పులతో రామ్ అలరించాడు. అయితే ఈ పాటలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డైలాగ్ పెట్టడంతో బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. గతంలో కేసీఆర్ ఓ ప్రెస్ మీట్ లో ఏం జేద్దమంటవు మరి అని విలేకర్లతో అన్న వాయిస్ ను ఐటం సాంగులో ఎలా వాడతరంటూ.. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తప్పుబడుతున్నారు. వెంటనే పాటలో ఉన్న కేసీఆర్ డైలాగ్ ను తొలగించాలని లేదంటే.. మూవీ రిలీజ్ కాకుండా ఆపుతామని హెచ్చరికలు జారీ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version