దేవిశ్రీ ప్రసాద్ బాలీవుడ్ తీరుతో హర్ట్ అయ్యాడా..!!.

-

 

మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ భారత దేశంలో చాలా ప్రధాన భాషల్లో  సంగీతం అందించారు. తన పాటలు ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో మొత్తం వూపాయి.డి.జే సాంగ్స్ మరియు స్పెషల్ సాంగ్స్ కు మనోడు సూపర్ ఫేమస్. సౌత్ లో ప్రధాన మ్యూజిక్ కంపోజర్ గా చాలా కాలం వున్నాడు.ప్రస్తుతం తమన్ రాకతో కొద్దిగా స్లో అయ్యాడు కాని, ఇప్పటికీ భారీ స్థాయిలో పారితోషికం తీసుకుంటున్నాడు. చాలా మంది డైరెక్టర్, నిర్మాతలకు సంగీత దర్శకుడిగా మొదటి ఆప్షన్ గా వున్నాడు. చాలా మంది అతని కోసం వెయిట్ చేస్తున్నారు.

 

దేవిశ్రీ ప్రసాద్ కి బాలీవుడ్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. తన పాటలు అక్కడ సూపర్ ఫేమస్ అయ్యాయి. గత బ్లాక్ బస్టర్ సినిమా పుష్ప పాటలు ఇప్పటికీ అక్కడ వేడుకల్లో వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం బాలీవుడ్ వారు దేవి ప్రసాద్ ను హర్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న  సినిమాకు  మొదట దేవి శ్రీ ప్రసాద్ ని సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. వాస్తవానికి తెలుగు సినిమా లో సంగీతం ఒక్కరికే ఎక్కువగా ఇస్తారు.కాని బాలీవుడ్ లో ఒక్కో సినిమాకు  ఇద్దరు, ముగ్గురు సంగీత దర్శకులు కామన్ గా పనిచేస్తారు. దేవి ప్రసాద్ ను మొదట తెలుగు లాగా మీరు ఒక్కరే సంగీతం ఇవ్వాలని కోరారట.

కాని తీరా మ్యూజిక్ వర్క్ మొదలు పెట్టేసరికి తనతో పాటు, మరో ముగ్గురు సంగీత దర్శకులు కూడా ఇదే సినిమా కు పనిచేస్తున్నారని తెలిసింది. దీనితో దేవి సినిమా డైరెక్టర్ ను గట్టిగా నిలదీశాడట. ఆ సినిమా వాళ్ళు ఏదో సర్ది చెప్పినట్టుగా గుసగుసలు వినిపించాయి.దీనిపై బాలీవుడ్ మీడియా లో కథనాలు కూడా వచ్చాయి.దేవి ప్రసాద్ కూడా దీన్ని పెద్ద కాంట్రవర్సీ చేయకుండా, ఏమి జరగనట్లుగా గుప్ చుప్ గా వున్నాడట. ఈ న్యూస్ ప్రస్తుతం టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news