ఎమోషనల్ పోస్ట్ చేసిన డైరెక్టర్ శ్రీనువైట్ల..!!

-

తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత కొన్ని నెలలుగా ఎక్కువగా విడాకుల విషయాలు బాగా వైరల్ గా మారుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ప్రముఖ డైరెక్టర్ అయిన శ్రీనువైట్ల తన భార్యతో విడాకులు తీసుకోబోతున్నట్లు గత కొన్ని రోజులకు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ వార్తలపై ఎవరూ కూడా సరైన క్లారిటీ ఇవ్వలేదు. కానీ తాజాగా శ్రీనువైట్ల ఒక ఎమోషనల్ పోస్ట్ చేయడం జరిగింది. వాటి గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రీనువైట్ల భార్య విడాకుల కోరుతూ నాంపల్లి కోర్టును ఆశ్రయించినట్లు గత కొద్ది రోజులుగా వార్తలు బాగా వినిపించాయి. ఇక అంతే కాకుండా శ్రీను వైట్ల కూడా తన కుటుంబానికి దూరంగానే ఉన్నట్లుగా వార్తలు సమాచారం. శ్రీను వైట్ల భార్య రూప శ్రీను ను విడిచి దూరంగా ఉంటోంది.. కానీ తన కూతుర్లు మాత్రం శ్రీనివాట్ల దగ్గరే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకప్పుడు అగ్ర దర్శకుడుగా పేరుపొంది ఎన్నో విజయాలను అందుకున్న శ్రీనువైట్ల ప్రొఫెషనల్ గా మంచి కమ్ బ్యాక్ ఇవ్వాలని కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

కానీ ఇలాంటి సమయంలో తన పర్సనల్ లైఫ్ సమస్యలు అడ్డు రావడంతో సినిమా తీసే ప్రయత్నాలను కూడా విరమించుకున్నారనే అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా తమ ముగ్గురు కూతుర్లతో కలిసి దిగిన ఒక ఫోటోని షేర్ చేశారు. ఇక ఈ ఫోటోకి క్యాప్షన్ ఈ విధంగా రాస్తు.. జీవితం చాలా అందంగా ఉంటుంది మీ ప్రియమైన వారితో అది మరింత ఎక్కువ అందాన్ని ఇస్తుంది అని తెలిపారు.. తన ముగ్గురు మస్కిటర్స్ లేని జీవితం తను ఊహించుకోలేనని పోస్ట్ చేయడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే శ్రీనువైట్ల కేవలం తన కూతుర్లతోనే ఉన్నారన్న విషయాన్ని ఈ పోస్టు ద్వారా తెలియజేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే మరి విడాకుల విషయంపై కూడా క్లారిటీ ఇస్తే బాగుంటుంది అని ఆయన అభిమానుల సైతం భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news