అల్లు అర్జున్ అభిమానులకు ఒకేసారి డబుల్ గుడ్ న్యూస్.. ఏమిటంటే..?

-

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా చిత్రం పుష్ప ది రైజ్. ఈ చిత్రం విడుదలైన ప్రతి చోట మంచి విజయాలను అందుకుంది. ఇక ఊహించని విధంగా రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టింది ఈ సినిమా. దీంతో ఈ సినిమా సీక్వెల్ పైన ప్రస్తుతం మంచి బజ్ ఏర్పడిందని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని చిత్ర బృందం పుష్ప-2 సినిమాని రూ.350 కోట్ల రూపాయలతో ఈ సినిమాని మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా రష్మి క నటిస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం అవుతున్నట్లుగా చిత్ర బృందం ఇదివరకే ప్రకటించడం జరిగింది.

ఇక డైరెక్టర్ సుకుమార్ కూడా స్క్రిప్ట్ వర్క్ ని కూడా పూర్తి చేయడం జరిగింది. అభిమానులు కూడా పుష్ప -2 సినిమా ఎప్పుడేప్పుడు సెట్స్ మీదకి వెళుతుందా అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక గతంలో నవంబర్ నెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా అక్టోబర్ మొదటి వారంలో మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

అక్టోబర్ ఒకటవ తేదీన ఈ సినిమాని సెట్స్ పైకి ఎందుకు తీసుకెళ్లబోతున్నారు అంటే అక్టోబర్ ఒకటవ తేదీన అల్లు అర్జున్ అత్యంత ప్రతిష్టాత్మకంగా అల్లు స్టూడియోస్ ని ప్రారంభించబోతున్నారు.. అందుకోసం భారీ ఏర్పాట్లు కూడా జరగబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇక అందులోనే ఈ సినిమా షూటింగ్ కూడా జరగబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతవరకు మెగా ఫ్యామిలీ ,అల్లు ఫ్యామిలీ ఎలాంటి స్టూడియో నిర్మాణాన్ని చేపట్టలేదు మొదటిసారి అల్లు ఫ్యామిలీ స్టూడియోను నిర్మిస్తూ ఉన్నారు. దీంతో అల్లు అర్జున్ అభిమానులకు డబుల్ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news