ఒకప్పుడు ఫుల్ బిజీ ఆర్టిస్ట్..కట్ చేస్తే సబ్బులమ్ముకుంటున్న నటి..ఎవరంటే?

-

సీనియర్ నటి లక్ష్మి కూతురు ఐశ్వర్య..నటించిన సినిమాలు ఎంతటి ఘన విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినిమాల్లో కీలక పాత్రలు పోషించిన ఐశ్వర్య భాస్కరన్..తెలుగు భాషలోనే కాకుండా మలయాళం, తమిళ్ భాషల్లోనూ నటించింది.

అన్ని భాషల్లో కలిపి మొత్తంగా 200 సినిమాలు చేసిన ఐశ్వర్య..తాజా ఇంటర్వ్యూలో తన ఆర్థిక పరిస్థితి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన కెరీర్ స్టార్టింగ్ డేస్ లో హీరోయిన్ రోల్స్ ప్లే చేసిన తాను..అవకాశాలు రాకపోవడంతో చిన్న చిన్న పాత్రలూ పోషించినట్లు తెలిపింది.

తనకు కొంత కాలానికి చిన్న చిన్న వేషాలు కూడా రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నానని వివరించింది. ఈ క్రమంలోనే ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కడం కోసం..ఇల్లు గడవడం కోసం ఇంటింటికి వెళ్లి సబ్బులు విక్రయిస్తున్నట్లు తెలిపింది. తనకు మంచి వేతనం ఇస్తే పాచి పనులు కూడా చేస్తానని, తనకు ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేవని అంది. తన కాళ్లపై తాను నిలబడుతున్నానని, అందుకు గర్వంగా ఉందని చెప్పింది. తను బతికింది సీరియల్స్ ద్వారానే అని, సినిమాల ద్వారా కాదని చెప్తూ భావోద్వేగానికి గురైంది ఐశ్వర్య. బుల్లి తెర తనకు అన్నం పెట్టిందని చెప్తూ కన్నీరు పెట్టుకుంది సీనియర్ నటి.

Read more RELATED
Recommended to you

Latest news