వరలక్ష్మి శరత్ కుమార్ కు టాలీవుడ్లో డిమాండ్ పెరిగిందా..?

-

తమిళ్ సీనియర్ స్టార్ హీరో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ ఇండస్ట్రీలోకి తమిళ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈమె హీరోగా నటించిన సినిమాలు ఆవరేజ్ టాకుతో గుర్తింపు తెచ్చుకోవడంతో ఈమెకు పెద్దగా సినిమాలలో హీరోయిన్గా అవకాశాలు రాలేదు. నిజానికి ఏ హీరోయిన్లైనా సరే గ్లామర్ రోల్స్ పాత్రలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. కానీ వరలక్ష్మి శరత్ కుమార్ మాత్రం మొదటి నుండీ కూడా హీరోయిన్ పాత్రలకు మాత్రమే కాకుండా లేడీ విలన్ పాత్రలను.. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలను చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఈమె ఫిజిక్ విలన్ పాత్రలకు బాగా సెట్ అవుతుందని.. అందుకే ఆమె చేసే ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందని ప్రముఖ సినీ విశ్లేషకులు కూడా చెబుతూ ఉంటారు.

తెలుగులో ఈమెకు వరుస సినిమాలు భారీ విజయాన్ని అందిస్తుండడంతో తమిళనాడు కూడా ఈమెకు మంచి డిమాండ్ పెరిగింది. ఇకపోతే వరలక్ష్మి శరత్ కుమార్ తాజాగా బ్యాక్ టు బ్యాక్ భారీ విజయాలను సొంతం చేసుకుంటూ సంక్రాంతి బరిలో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది వరలక్ష్మి శరత్ కుమార్. ఇప్పుడు బాలకృష్ణతో కలిసి వీరసింహారెడ్డి సినిమాలో ఆయనకు చెల్లిగా నటించి మెప్పించింది. ముఖ్యంగా ఈమె చెప్పే డైలాగ్ లు థియేటర్లో భారీగా పేలాయి. లేడీ విలన్ పాత్రలో ప్రత్యర్థులకు చెమటలు పట్టించే విధంగా తన డైలాగ్స్ తో ఉర్రూతలూగించింది ఈ ముద్దుగుమ్మ.

ఇకపోతే సినిమా ఫలితంతో సంబంధం లేకుండా వరలక్ష్మి శరత్ కుమార్ కి వీరసింహారెడ్డి సినిమా మంచి గుర్తింపు అందించిందని చెప్పవచ్చు. అలాగే ఈమెకు కూడా హీరోయిన్స్ స్థాయిలో రెమ్యునరేషన్ ను నిర్మాతలు ఆఫర్ చేస్తున్నారని తెలుస్తోంది. నిజానికి తెలుగులో ఒక క్యారెక్టర్ ఆర్టిస్టుకు కోటి రూపాయలు రెమ్యునరేషన్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఇందుకు కారణం ఆమె నటనా ప్రతిభ అని చెప్పవచ్చు. ఏది ఏమైనా వరలక్ష్మి శరత్ కుమార్ కు అటు కోలీవుడ్ లోనూ ఇటు టాలీవుడ్ లోనూ బాగా డిమాండ్ పెరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news