‘ఆదిత్య 369’ స్టోరి విని బాలయ్య ఇచ్చిన రియాక్షన్‌పై నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు..

-

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలయ్య ప్రజెంట్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమా చేస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా శ్రుతిహాసన్ నటిస్తుండగా, ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఆయన నటించిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘ఆదిత్య 369’..తెలుగు చిత్రసీమలోనే డిఫరెంట్ ఫిల్మ్ గా హిస్టరీలో నిలుస్తుంది.

టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఈ పిక్చర్.. స్టోరి తన వద్దకు ఎలా వచ్చింది? అసలు ఈ స్టోరి విని బాలయ్య అప్పట్లో ఏమన్నాడు? అనే విషయాలను నిర్మాత ఎస్.కృష్ణ ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై ‘ఆదిత్య 369’ ఫిల్మ్ ను ప్రొడ్యూసర్ ఎస్.కృష్ణ ప్రసాద్ ప్రొడ్యూస్ చేశారు.

ఈ సినిమా స్టోరిని తొలుత సింగీతం శ్రీనివాసరావు ఫ్లైట్ లో లెజెండరీ సింగర్ ఎస్పీ బాలుకు చెప్పారు. అది విని తనకు బాగా నచ్చిందని చెప్పాడు బాలు. ఆ తర్వాత ఈ స్టోరి విషయమై నిర్మాత కృష్ణ ప్రసాద్ కు చెప్పారు. కృష్ణ ప్రసాద్ నటుడు చంద్రమోహన్ మేనల్లుడు. ఇక ఈ స్టోరి వినేందుకు సింగీతం శ్రీనివాసరావు వద్దకు వెళ్లిన కృష్ణ ప్రసాద్..తనకు నచ్చిందని చెప్పి.. బాలయ్య అయితేనే ఈ స్టోరికి సరిపోతాడని అన్నాడు.

అలా ఈ చిత్ర కథను బాలయ్యకు వినిపించాలనుకున్నారు. బాలు సాయంతో ఒక రోజు నందమూరి బాలయ్య ఇంటికి వెళ్లారు నిర్మాత కృష్ణ ప్రసాద్, దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు, సింగర్ బాలు. ఇక ఆ తర్వాత సింగీతం శ్రీనివాసరావు స్టోరి చెప్పడం స్టార్ట్ చేసిన అరగంట తర్వాతనే ..‘మనం ఈ సినిమా చేస్తున్నాం’ అని బాలయ్య చెప్పేశారట. అలా ఈ సినిమా చేయాలని నిర్ణయం అంత త్వరగా బాలయ్య తీసుకున్నారని నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. ఈ సినిమాకు సీక్వెల్ తీయడానికి తాను రెడీగా ఉన్నానని, అది కూడా బాలయ్యతోనే చేస్తానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సింగీతం శ్రీనివాసరావు చెప్పారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news