టాలీవుడ్ హీరో వెంటపడుతున్న లోకేష్ కనగరాజు..!

-

విక్రమ్ సినిమాతో అన్ని ఇండస్ట్రీల ప్రేక్షకుల చూపును తన వైపు తిప్పుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ చిత్రంతో భారీ విజయం సాధించి కోలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాసిన ఈయన .. ప్రస్తుతం విజయ దళపతి తో ఒక మూవీ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్టుకి వర్కింగ్ టైటిల్ గా దళపతి 67 అని పెట్టి సినిమా షూటింగ్ కొనసాగిస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సినిమా పట్టాల మీద ఉండగానే ఈయనకు సంబంధించిన ఒక అప్డేట్ ఇప్పుడు కోలీవుడ్ మీడియాలో చక్కెరలు కొడుతోంది.

టాలీవుడ్ హీరో తో తన తదుపరిచిత్రాన్ని చేయడానికి తిరుగుతున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయంలోకి వెళితే పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ తో లోకేష్ కనగరాజు సినిమా చేయబోతున్నాడని కోలీవుడ్ మీడియాలో వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. దళపతి 67, ఖైదీ 2 సినిమాలు పూర్తి కాగానే అల్లు అర్జున్ ప్రాజెక్టు పట్టాలెక్కబోతుందని సమాచారం. లోకేష్ ఈ రెండు ప్రాజెక్టులను తెరకెక్కించే లోపే అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాని కూడా పూర్తి చేస్తాడని తెలుస్తోంది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రాబోతోందని.. ఇప్పుడు వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.

గతంలో కూడా లోకేష్, రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్, జయం రవి లతో పని చేస్తాడని వార్తలు బాగా వైరల్ అయ్యాయి. అయితే ఇప్పటివరకు వారికి సంబంధించిన సినిమాల గురించి ప్రకటన రాలేదు. కొన్ని రోజుల క్రితం లోకేష్ కనగరాజు మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. పదేళ్ల వరకు షెడ్యూల్ బిజీగా ఉందన్నాడు. మరి అల్లు అర్జున్ గురించి అందులో ప్రస్తావించలేదు. ఈ తరుణంలోనే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందా అనేది కూడా సందేహంగానే మారింది.

Read more RELATED
Recommended to you

Latest news