SSMB28 : మహేష్ సినిమాలో లేడీ విలన్ !

-

అతడు, ఖలేజా చిత్రాలతో టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్‌గా నిలిచారు నటుడు మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్‌. ఈ ఇద్దరి కాంబోలో రాబోతున్న మూడో చిత్రం #SSMB28 (వర్కింగ్‌ టైటిల్‌) ప్రకటన వెలువడటమే ఆలస్యం సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది.

వీరి కాంబినేషన్ లో రానున్న పాన్ ఇండియా చిత్రం పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త బయటకొచ్చింది. ఇందులోని ఓ నెగిటివ్ పాత్ర కోసం ఇటీవల ‘పొన్నియన్ సెల్వన్’ లో నటించి మెప్పించిన మలయాళ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మీని సంప్రదించారట. మహేష్-ఐశ్వర్యల మధ్య సీన్స్ ఆసక్తికరంగా ఉంటాయని సమాచారం. మరి ఆ సినిమాలో ఆమె పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news