కరాటే కళ్యాణికి మంచు విష్ణు నోటీసులు

-

ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్ వద్ద 54 అడుగుల పొడవైన శ్రీకృష్ణుని వేషాధారణలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణను నిలిపివేయాలని అఖిల భారత యాదవ సంఘం జాతీయ మహిళా అధ్యక్షురాలు కరాటే కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కృష్ణుడి రూపంలో తారక రామారావు విగ్రహాన్ని పెట్టడాన్ని ఆమె తప్పు పట్టారు. దేవుని రూపంలో ఉన్న రాజకీయ వ్యక్తిని ఆరాధించడం తమ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తాయని అన్నారు.

ఇది మత విద్వేషాలను రాజకీయం చేసి సమాజంలో అలజడులను సృష్టించే ప్రక్రియగా ఆమె అభివర్ణించారు. అయితే కరాటే కళ్యాణి చేసిన వ్యాఖ్యలకు మా అధ్యక్షుడు మంచు విష్ణు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, క్రమశిక్షణ ఉల్లంఘన కింద నోటీసులు పంపారు. మూడు రోజులలోగా దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అయితే ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణను అడ్డుకుంటామని చెబుతూ వస్తున్న నేపథ్యంలో ఈ నోటీసులపై కరాటే కళ్యాణి ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news