బాలయ్య డైరెక్టర్ గోపీచంద్ మలినేనికి చిరంజీవి గిఫ్ట్

-

సాధారణంగా ఓ సినిమా హిట్ అయితే ఆ మూవీలో నటించిన హీరో.. చిత్ర దర్శకుడికి కృతజ్ఞతగా గిఫ్ట్ ఇవ్వడం ఇటీవల టాలీవుడ్​లో వస్తోన్న ట్రెండ్. అయితే దీనికి భిన్నంగా.. ఈసారి మెగాస్టార్ చిరంజీవి.. బాలయ్య నటించిన వీరసింహారెడ్డి చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేనికి ఓ ఖరీదైన బహుమానం ఇచ్చారట. అదేంటి.. ఇస్తే వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబీకి ఇవ్వాలి గానీ.. గోపీచంద్​కు ఎందుకు ఇచ్చారనుకుంటున్నారా..? మరి ఎందుకో తెలియాలంటే.. ఈ స్టోరీ చదివేయండి.

వీరసింహారెడ్డి సినిమా విడుదలై వారం గడుస్తున్నా.. థియేటర్​లో ఇంకా బాలయ్య మాస్ మేనియా తగ్గడం లేదు. అదేవిధంగా కలెక్షన్లలోనూ జోరు తగ్గినట్లు కనిపించడం లేదు. వేరే సినిమాలు ఏం లేకపోవడం.. బాలయ్య ఈ మూవీలో కొత్తగా.. స్టైలిష్​గా కనిపించడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. మరోవైపు ఇప్పటికే ఘన విజయం సాధించిన ఈ మూవీ సక్సెస్ జోష్​లో ఉన్నారు డైరెక్టర్ గోపీచంద్ మలినేని. ఈ క్రమంలోనే వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికర విషయాలను బయటపెడుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్‌ చిరంజీవి తనకు ఓ స్పెషల్​ గిఫ్ట్‌ ఇచ్చారంటూ గుర్తుచేసుకున్నారు.

“నాకు రవి తేజగారికి పోలికలుంటాయి అని అందరూ అంటుంటారు. కొన్ని షాట్స్​ చేసేటప్పుడు రవితేజ అయితే నువ్వు నిలుచో నేను వెళ్తున్నాను అని చెప్పి వెళ్లి పోయేవారు. అలానే చిరంజీవిగారు కూడా బక్క రవితేజ అని పిలిచేవారు. ఓసారి షూటింగ్ స్పాట్​లో ఉన్నప్పుడు నా పుట్టినరోజు వచ్చింది. అప్పుడు అల్లు అరవింద్​ చిరంజీవి వచ్చారు. ఓ వాచ్​ తెప్పించి గిఫ్ట్​గా ఇచ్చారు. అప్పుడు చిరు.. ఇక నీ టైమ్​ బాగుంటుందని అన్నారు. ఇక ఇప్పటివరకు ఏ సినిమాకు నాకు ఫుల్​ రెమ్యునరేషన్​ ఇవ్వలేదు. వీర సింహారెడ్డికే తొలి సారి ఇచ్చారు.” అని గోపి చంద్​ చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news