స్టార్స్ లేకుండానే అద్భుతం చేసిన దర్శకుడు బాపు.. ఆ సినిమా చూసి ఎన్టీఆర్ రియాక్షన్ ఇదే..!

-

దర్శకుడు బాపు..తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలని, ఆ కళాఖండంలో తము కూడా ఒక భాగం కావాలని నటీనటులు అందరూ అనుకుంటారు. ఆయన తీసిన అద్భుతమైన కళాత్మక చిత్రాలు చూసి జనాలు అప్పట్లో ఆశ్చర్యపోయేవారు. సీనియర్ ఎన్టీఆర్ సైతం బాపు తీసిన ఒక సినిమా చూసి ఆశ్చర్యపోయారు. ఆ సినిమా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సహజత్వం ఉట్టిపడేలా చిత్రంలో దర్శకుడు బాపు జాగ్రత్తలు తీసుకుంటారు. ఆయన అప్పట్లో వర్తమాన నటీనటులతో తీసిన గొప్ప చిత్రం ‘ముత్యాల ముగ్గు’. ఇందులో స్టార్స్ ఎవరూ లేరు. విలన్ గా ఇందులో రావు గోపాల్ రావు నటించారు. అయితే, అప్పటికి రావు గోపాల్ రావుకు అంతటి పేరు అయితే లేదు. సుమారుగా ఈ చిత్రం తీయాడానికి మేకర్స్ కు రూ.12 లక్షలు ఖర్చు అయిందట.

ఇక ఈ చిత్రం తీయడం పూర్తి అయిన తర్వాత తొలి కాపీని సీనియర్ ఎన్టీఆర్ కు చూపించారు. ఆ సినిమా చూసి న ఎన్టీఆర్.. ‘‘మా రోజులు గుర్తుచేశావ్ బ్రద‌ర్’’ అంటూ బాపును అభినందించారు. ఇందులో నటీనటులు మేకప్ లేకుండా నటించడం విశేషం. శ్రీధర్ హీరోగా నటించగా, హీరోయిన్ గా సంగీత నటించింది.

ఇక ఈ పిక్చర్ రిలీజ్ కొన్ని థియేటర్స్ లో నే అయింది. కానీ, సినిమా టాక్ బాగుండి ..కలెక్షన్స్ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో తర్వాత వేరే థియేటర్లలోనూ సినిమా విడుదల చేశారు. అలా టాకీసుల్లో ఈ సినిమాను చూసి జనాలు ఆనండదపడ్డారు. లక్షల రూపాయలు ఈ సినిమా మేకింగ్ కోసం మేకర్స్ ఖర్చు పెట్టగా రూ.కోట్ల ల్లో లాభాలు వచ్చాయట. అలా దర్శకుడు బాపు తన సినిమాతో మ్యాజిక్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news