వివాదంలో చిక్కున్న‌ నటుడు శింబు.. ఫిర్యాదు చేసిన నిర్మాత‌..

-

హీరోగా, గాయకుడిగా, పాటల రచయితగా వివిధ రకాల టాలెంటులతో ఆకట్టుకునే శింబు… నిత్యం ఏదో ఇక వివాదంలో చిక్కుకుంటూనే ఉంటారు. ఇక తాజాగా శింబుపై నిర్మాత ఒకరు నిర్మాతల కౌన్సిల్‌లో సోమవారం ఫిర్యాదు చేశారు. అలాగే కెట్టవన్, మన్మథన్, ఏఏఏ అనే పలు చిత్రాల గురించి శింబుపై అనేక ఫిర్యాదులందాయి. ఇతనికి రెడ్‌కార్డ్ సైతం ఇచ్చేందుకు నిర్మాతల సంఘం నుంచి నిర్ణయం తీసుకున్నారు. శింబు మఫ్టీ అనే ఓ కన్నడ చిత్రం రిమేక్ లో నటిస్తుండగా.. దాని షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది.

దానికి కారణం శింబునే అంటూ నిర్మాత మండిపడుతున్నాడు. కన్నడ చిత్రమైన మఫ్టీ రీమేక్‌ చేస్తున్న నిర్మాత జ్ఞానవేల్‌రాజా నిర్మాతల సంఘంలో ఫిర్యాదు చేశారు. అందులో శింబు సక్రమంగా షూటింగ్‌కు రాలేదని, దీంతో చిత్ర నిర్మాణ ఖర్చు భారీగా పెరిగిందని తెలిపారు. మిగతా నటీనటుల షూటింగ్‌కు అంతరాయం కలిగిందని, వీరికి అనవసరంగా నష్టపరిహారం చెల్లించాల్సి వస్తోందని తెలిపారు. మొదటి పదిరోజుల షూటింగే జరగలేదని ఆయన తన ఫిర్యాదులో తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news