ఫేమస్ షోలో గెస్ట్ అతనే..ఆ సౌత్ హీరో మాస్టర్ ప్లాన్!

-

ఇటీవల కాలంలో విడుదలైన సౌత్ ఇండియన్ సినిమాలు దేశవ్యాప్తంగా విశేష ఆదరణ పొందుతున్నాయి. ఇక సౌత్ ఇండియన్ స్టార్ హీరోలు అందరూ పాన్ ఇండియా వైడ్ తమ చిత్రాలు విడుదల చేసే యోచనలో ఉన్నారు. ఒకవేళ అదే కనుక జరిగితే ఇక భవిష్యత్తులో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మాత్రమే ఉంటుందని సినీ పరిశీలకులు చెప్తున్నారు.

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ హోస్ట్ గా వ్యవహరించే ఫేమస్ షో ‘కాఫీ విత్ కరణ్’ గురించి అందరికీ తెలుసు. ఈ షో ఇప్పటి వరకు ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది. ఏడో సీజన్ డిజిటల్ గా రన్ అవనుంది. అనగా OTT డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ ఏడో సీజన్ స్ట్రీమ్ కానుంది. కాగా, ఈ సీజన్ గెస్టులుగా సౌత్ సెలబ్రిటీలను ఆహ్వానించబోతున్నట్లు వార్తలొచ్చాయి.

ఈ క్రమంలోనే ఈ షోలో పార్టిసిపేట్ చేయబడానికి సౌత్ ఇండియన్ ఫిల్మ్ స్టార్స్ రెడీగానే ఉన్నారని తెలుస్తోంది. ‘పుష్ప’ చిత్రంతో నార్త్ ఇండియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..‘కాఫీ విత్ కరణ్’ షోలో పార్టిసిపేట్ చేసి తన పాపులారిటీని ఇంకా పెంచుకోవడం‌తో పాటు ఉత్తర భారతదేశంలోని సినీ అభిమానులకు మరింత దగ్గర అవ్వాలని అనుకుంటున్నారట. ఇక ఈ సారి ఏడో సీజన్ వెరీ డిఫరెంట్ గా ఉండబోతున్నదని, సినీ పరిశ్రమ గురించి లోతైన చర్చ ఉండబోతున్నదని కరణ్ జోహార్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news