‘పుష్ప-2’లో ఊహించని ట్విస్టులు..శ్రీవల్లి మరణం, మరో నాయిక ఎంట్రీ?

-

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప: పార్ట్ వన్ : ది రైజ్’ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయి రికార్డులు క్రియేట్ చేసింది. దేశవ్యాప్తంగా ఈ సినిమాకు విశేష ఆదరణ లభించింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..ఈ పిక్చర్ తో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడని చెప్పొచ్చు.

తగ్గేదేలే అని బన్నీ చెప్పే డైలాగ్ అందరి నోట వినబడింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మిక మందన..‘శ్రీ వల్లి’గా జనాలను అలరించింది. సినిమా పార్ట్ వన్ ఎండింగ్ లో బన్నీ, రష్మికను మ్యారేజ్ చేసుకోవడంతో సినిమా ముగుస్తుంది. కాగా, సెకండ్ పార్ట్ లో ఊహించని ట్విస్టులు ఉంటాయని సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి.

ఆ వార్తల ప్రకారం..సిండికేట్ డాన్ పుష్ప భార్య..శ్రీవల్లి చనిపోతుందట. ఆమె స్థానంలో మరో హీరోయిన్ ఎంట్రీ ఇవ్వడం కోసం సుకుమార్ స్టోరిలో మార్పులు చేశాడని తెలుస్తోంది. ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో సెకండ్ పార్ట్ లో అంతకు మించిన స్టోరి, విజ్యువల్స్ , ట్విస్టులు ఉండాలని దర్శకుడు సుకుమార్..స్టోరిపైన ఫుల్ కాన్సంట్రేట్ చేసినట్లు సమాచారం. ఇందులో నిజమెంత ఉందనేది తెలియాలంటే సెకండ్ పార్ట్ షూటింగ్ పూర్తయి..సినిమా విడుదల కావాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news