మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ ప్రాజెక్ట్ లోకి యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ …?

-

మెగాస్టార్ చిరంజీవి సైరా న‌ర్సింహారెడ్డి సినిమా సమయంలో కొర‌టాల శివ కి డేట్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాంతో కొరటాల శివ చిరంజీవి ని డైరెక్ట్ చేయడానికి దాదాపు రెండేళ్ళ నుండి ఎదురు చూస్తున్నారు. ఇక ఈ కాంబినేషన్ లో తెరకెక్కించబోతున్న సినిమాకి ఆచార్య అనే టైటిల్ అనుకున్న‌ట్లు ఇటీవ‌లె జ‌రిగిన ఓ ప‌బ్లిక్ ఫంక్ష‌న్ లో చిరంజీవి తెలిపారు. దాంతో స్వయంగా చిరంజీవి టైటిల్ అనౌన్స్ చేశారని అందరూ ఈ సినిమా ఇలా ఉండబోతుంది అలా ఉండబోతుందని అంచనాలు వేసేసుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో చిరంజీవి తో పాటు మరో కీలకమైన పాత్ర కూడా ఉందని కొరటాల బృందం ముందునుంచి చెబుతున్నారు.

ఆ పాత్ర కోసం మొద‌ట రామ్‌ చ‌ర‌ణ్‌ను నటింపచేయాలని చిరంజీవి కొరటాల శివ అనుకున్నారు. కానీ రామ్‌ చ‌ర‌ణ్ రాజ‌మౌళి ఆర్.ఆర్‌.ఆర్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ ఇయర్ రామ్‌ చ‌ర‌ణ్‌ ఈ సినిమా కోసం డేట్స్ కేటాయించే అవకాశాలు లేవు. ఆ త‌ర్వాత ఈ పాత్ర కోసం మ‌హేష్‌ బాబు నటిస్తున్నారని అందుకు గాను 40 కోట్లరెమ్యూనరేషన్ కూడా ఇవ్వనున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ పాత్ర కోసం లేటెస్ట్‌గా నంద‌మూరి హీరో ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది.

అయితే ఎన్టీఆర్ కూడా ఆర్‌.ఆర్‌.ఆర్ బిజీలోనే ఉన్నారు. కానీ రామ్‌ చ‌ర‌ణ్‌ కంటే ముందుగానే ఎన్టీఆర్ షూట్ పూర్త‌వుతుందట. దీంతో ఈ చిత్ర టీమ్ ఎన్టీఆర్‌ ని సంప్ర‌దించ‌నున్న‌ట్లు స‌మాచారం. మ‌రి ఈ పాత్రలో మహేష్ బాబు నటిస్తారా . ఎన్టీఆర్‌ నటిస్తారా .. అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ విష‌యంలో చిత్ర బృందం అఫీషియల్ గా అనౌన్స్ చేస్తే గాని ప్రేక్షకులకి క్లారిటీ వస్తుంది. మరి చిరంజీవి తో పాటు మహేష్ బాబు ఒక్కరే నటిస్తారా, లేదా ఆ పాత్రలో ఎన్టీఆర్‌ నటిస్తారా లేకపోతే ఇద్దరివి వేరే పాత్రలు ఉన్నాయా అన్నది త్వరలో తెలుస్తుందని అంటున్నారు. ఒకవేళ చిరంజీవి, మహేష్ బాబు , ఎన్టీఆర్‌ .. ముగ్గురు గనక ఉంటే మాత్రం ఇలాంటి మల్టీ స్టారర్ ఇదే మొదటిది అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news