10 నెలలు రాసిచ్చిన ఎన్.టి.ఆర్, చరణ్..!

-

బాహుబలి తర్వాత రాజమౌళి ఎలాంటి సినిమా చేస్తాడు అన్న అంచనాలను మించేలా ట్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు జక్కన్న. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్, చరణ్ ఇద్దరు పోటాపోటీగా నటిస్తున్నారట. బాహుబలి రెండు పార్టుల కోసం నాలుగేళ్లు టైం తీసుకున్న రాజమౌళి ఈ ఆర్.ఆర్.ఆర్ ఎన్నేళ్లు చేస్తాడో అన్న డౌట్ అందరిలోనూ ఉంది.

ఇక ప్రభాస్ అయితే రాజమౌళి కోసం 3 ఏళ్లు రాసిచ్చాడు. మరి ఎన్.టి.ఆర్, చరణ్ ట్రిపుల్ ఆర్ కోసం ఎంత టైం ఇచ్చారు అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం రాజమౌళి ఎన్.టి.ఆర్, చరణ్ ఇద్దరిని జస్ట్ 10 నెలల డేట్స్ ఇవ్వమని అడిగాడట. అంటే ఒక సంవత్సరం లోపే. అయితే ఈ వన్ ఇయర్ ఏ సినిమా చేయకూడదు అన్నది అగ్రిమెంట్.

ఎన్.టి.ఆర్, చరణ్ హ్యాపీగా రాజమౌళి అడిగిన 10 నెలలు టైం ఇచ్చేశారట. ఇదవరకులా కాకుండా ఈసారి పర్ఫెక్ట్ టైం లో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడట రాజమౌళి. పిరియాడికల్ మూవీగా వస్తున్న ట్రిపుల్ ఆర్ మూవీ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news